ప్రపంచాన్ని వణికిస్తున్న కారోన వైరస్ ని నియంత్రానికి అవసరమైన వ్యాక్సిన్ కోసం యావత్ ప్రజానీకం ఎదురు చూస్తోంది. ఇదే అంశంపై స్పందించిన WHO చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కొన్ని ఆశక్తికర విషయాలు వెల్లడించారు.
అన్ని అనుకున్నట్లు జరిగితే ఇంకో 12-18నెలల మధ్య కాలంలో కారోన ని నియంత్రించే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని స్వామినాథన్ తెలిపారు. కానీ వైరస్ భయానకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అందరికి కావలిసిన మందులు, టీకాలు అందుబాటులోకి రావాలంటే మరో ఆరునెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.
మూడు దశలకు పైగా, ప్రోటోకాల్స్ ప్రకారం వ్యాక్సిన్ భద్రత మరియు సామర్థ్యాన్ని పరీక్షించాలి. నాల్గవ దశలో పోస్ట్ మార్కెటింగ్ డేటా సేకరణ మరియు విశ్లేషణ ఉంటుంది. జంతువులతో మొదటిగా పరీక్షించిన తర్వాత మనుషులపై ప్రయోగిస్తారు.
సార్స్, హెచ్ఐవి వంటి మందుల మిక్సర్ తో కారోన మందును తయారు చేస్తున్నట్లు సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ అన్నారు
