spot_img
Homeజాతీయ వార్తలుకెసిఆర్ సీతయ్య! ఎవరి మాటా వినడు...

కెసిఆర్ సీతయ్య! ఎవరి మాటా వినడు…

హైదరాబాద్ ని మూడు కార్పొరేషన్లుగా విభజించాలనే ప్రయత్నం మానుకున్నారు. దానికి బదులు కొత్త గా అదనంగా ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటుచేస్తున్నారు. అలాగే ఇటీవల బాగా ప్రాచుర్యం లోకి వచ్చిన మణికొండ దానిచుట్టుపక్కల ప్రాంతాలను జిహెచ్ ఎంసీ లో కలుపుతున్నారు. ఈ రెండు పరిణామాలు ఆహ్వానించదగ్గవిగానే వున్నాయి. నిన్న అనుకున్నట్లు హైదరాబాద్ ని మూడు కార్పొరేషన్లగా చేసే ఆలోచనను విరమించుకున్నట్లే చెప్పాలి. మూడు కార్పొరేషన్ల ఆలోచన ఢిల్లీ నుంచి తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని విరమించుకొని ముంబై మోడల్ ని తెరపైకి తెచ్చారు.

ఓ విధంగా ఇది మంచిదే. శివారు ప్రాంతాలు మొత్తం ఒకేసారి హైదరాబాద్ లో కలిపితే చాలా సమస్యలు వచ్చే అవకాశం వుంది. శివారు ప్రాంతాలు ఇప్పటివరకు పంచాయతీలో ఉండటంవలన ప్రణాళికలేకుండా , తగిన నగర అనుభవంలేని సిబ్బందితో నడిచాయి. ఒక్కసారి వాటిని హైదరాబాద్ నగరం లో కలిపే బదులు ప్రత్యేకంగా ఉంచటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే అదేసమయంలో ఓ ప్రణాళికా బద్దంగా అభివృద్ధి చెందాలంటే వాటిని నగరపాలికలు చేయటమే మంచిది.

కెసిఆర్ ఆలోచనలు మిగతావాళ్లకు భిన్నంగా, విన్నూత్నంగా వుంటాయనే దాంట్లో సందేహం లేదు. అయితే అన్నిసార్లు అవి ప్రజారంజకంగా వుండవు. కెసిఆర్ తో వచ్చిన చిక్కల్లా తాను చెప్పిందే వినాలి. పారదర్శకంగా అందరి అభిప్రాయాలు తీసుకుని పోదామనే ఆలోచన తనకు పొసగదు. అంతమాత్రాన తన ఆలోచనలు కొట్టిపారేసేవిగా వుండవు. సమస్యల్లా ‘ సీతయ్య ఎవరిమాటా వినడు’ తోనే . నిజంచెప్పాలంటే తన పధకాలను మిగతా దేశం కాపీ కొడుతోంది. ఎవరు కాదన్నా ఇది నిజం. అంటే సృజనాత్మక ఆలోచనలు వున్నట్లే కదా. కొంచెం మార్చుకొని మిగతా వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకుంటే అందరి మన్ననలను పొందొచ్చు. ఓ విధంగా కెసిఆర్ మంచి నియంత ( benevolent dictator ) గా ఉండటమే ఇష్టపడతాడు. ప్రజలు కూడా తనని అలానే చూస్తున్నారు. ఇప్పటివరకు కెసిఆర్ ని ఆ రకంగా ఇష్టపడుతున్నారు. అయితే ముందు ముందు ఎలా ఉంటుందో మరి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version