ఈ రోజు నేను యూట్యూబు లో అరుణ్ కుమార్ గారి ప్రెస్ మీట్ విన్నాను. ముందుగా ఒక విషయం చెప్పాలి, నేను అరుణ్ కుమార్ గారిని అభిమానిస్తాను . ఎందుకంటే, ఈరోజుల్లో అవినీతిలేని నాయకులు మచ్చుకైనా కనిపించరు . అరుణ్ కుమార్ గారు ఏవిషయాన్నైనా ముక్కు సూటిగా మాట్లాతారని నేను నమ్ముతున్నాను. అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఫ్రీగా తన అభిప్రాయాలను వెళ్లబుచ్చుతున్నారు . కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినా, ఆ పార్టీకి సానుభూతి పరుడుగా ఉండటంలో తప్పులేదు.
నాకు అర్ధం కానీ విషయం ఒకటి అరుణ్ కుమార్ గారు ప్రస్తావించారు. తెలుగు ప్రజలకు వారు కొంత వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అనుకుంటున్నాను. కాశ్మిర్ విషయం మాట్లాడుతూ 2 నెలల నుండి వాళ్ళను నిర్బంధంలో ఉంచి ‘అంతా బాగుంది’ అని అన్ని భాషలలో భారతదేశంలో ఉన్న ప్రజలందరికి హ్యూస్టన్, అమెరికా నుండి బాకా కొట్టారు, మోడీ గారు అన్నారు . నాకు అదికూడా తప్పు అని అనిపించలేదు. ఎవరి అభిప్రాయాలు వారివి. కాశ్మిర్ లో 70 సంవత్సరాలనుండి మనం అనుసరిస్తున్న విధానం సమ్మతమేనా? కానప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి? అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ లైన్ దాటి వెళ్లటంలేదు అని తెలుస్తుంది.
ఆ తర్వాత POK గురించి ప్రస్తావించారు. సమస్యల్లా ఇక్కడే ఉంది . మోడీ గారు POK కూడా మనదే అంటారేమో అన్నారు. మొన్న ఆర్టికల్ 370 గురించి పార్లమెంటులో చర్చించి నప్పుడు, TMC MP కుడా ఇదే చెప్పారు. కాశ్మీర్ సమస్య పాకిస్తాన్ తో చర్చించ కుండా ఎలా నిర్ణయం తీసుకుంటాం అని. నాకు అర్ధమవుతున్నది, అరుణ్ కుమార్ గారు ఇంకా మిగతా కాంగ్రెస్ వాళ్ళ దృష్టిలో కాశ్మీర్ పాకిస్తానుకు చెందినది , మనం దానిని అక్రమంగా ఆక్రమించుకున్నాం అని. అరుణ్ కుమార్ గారికి ఒక సవాల్. మీరు కాశ్మీర్ విషయంలో మీ అభిప్రాయాన్ని స్పష్టం గా తెలుగు ప్రజలకు చెప్పాలి. డిబేట్ చేయటానికి మాకేం అభ్యంతరం లేదు. కాశ్మీర్ (POK తో కలుపుకొని) మనది కాదా? అన్ని సంస్థానాలులాగా కాకుండా దీనిని మనం ఆక్రమించుకున్నామా? POK లో కొంత భాగాన్ని చైనాకు ఇవ్వటానికి పాకిస్తానుకు అధికారం ఉందా? కొన్ని దశాబ్దాల క్రితమే POK లో పాకిస్తాన్ షియా తెగను అంతంచేసి వాళ్లస్థానంలో సున్నీలను తీసుకురావటం వాళ్ళ అంతర్గత సమస్యా? ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి మీరు స్పందిస్తానంటే.