Rahul Gandhi Parliament Drama : రాహుల్ గాంధీ పార్లమెంట్ డ్రామాలకు హద్దు లేకుండా పోతోంది. ఆయన ఇండీ కూటమిలోని మిగతా ప్రతిపక్షాలు.. మిత్రపక్షాలు ఈయనను భరించలేని స్థాయికి వచ్చింది. నిన్న మంగళవారం ఉదయం పార్లమెంట్ మొదలైనప్పుడు జరిగే గొడవల్లో టీఎంసీ, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీలు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ మాత్రమే గొడవ చేసింది. దీంతో మిత్రపక్షాలు కాంగ్రెస్ కు దూరంగా జరిగాయని.. రాహుల్ గాంధీ డ్రామాలకు తాము అంటకాగమని చెప్పకనే చెప్పాయి.
తమిళనాడు, బెంగాల్ లో అసెంబ్లీలో ఎన్నికలు ఉండడంతో వారు పార్లమెంట్ లో గళమెత్తాలని చూస్తున్నారు. కానీ ఫోకస్ కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ మీద ఉండాలనే ఇలా చేస్తోంది. టీఎంసీ అయితే అవిశ్వాస తీర్మానం మీద సంతకం పెట్టకుండా షాకిచ్చింది.
ఎటువంటి సంప్రదింపులు లేకుండా.. పార్లమెంట్ జరగాలంటే రాహుల్ గాంధీ మాట్లాడాలి. సస్పెండ్ చేసిన 8 ఎంపీల సస్పెన్షన్ విత్ డ్రా చేయించాలని.. ఈ రెండూ జరుగకుంటే పార్లమెంట్ జరగనివ్వము అంటూ కాంగ్రెస్ భీష్మించుకు కూర్చుంది.
అడ్డంగా దొరికిపోయినా బుకాయిస్తున్న రాహుల్ గాంధీ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
