ప్రశాంత్ కిషోర్.. ఒకనాడు ఎన్నికల వ్యూహకర్త.. నేడు ఫక్తు రాజకీయ వాది. రాజకీయవేత్తగా మారిపోయాడు. భారత రాజకీయాల్లో వ్యూహకర్తగా పది సంవత్సరాల్లో పైకి ఎదిగిన పీకే తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పీకే ప్రతిభను మెచ్చుకోవచ్చు. 2013లో ఐప్యాక్ పెట్టాడు. 2014లో మోడీకి వ్యూహకర్తగా ఉన్నాడు. 2015లో మోడీకి వ్యతిరేకంగా నితీష్ కు వ్యూహకర్తగా మారాడు. మమతా, కేజ్రీవాల్, జగన్, స్టాలిన్ లాంటి ఎన్నో ప్రాంతీయ పార్టీలకు వ్యూహకర్తగా మారాడు.
ప్రశాంత్ కిషోర్ ప్రతిభను గుర్తించి బీహార్ సీఎం నితీష్ కుమార్ ఏకంగా తన జేడీయూ పార్టీకి వైస్ ప్రెసిడెంట్ ను చేశాడు. అయితే నితీష్ కు , పీకేకు ఎక్కడ చెడిందో తెలియదు. కానీ ఇద్దరూ అభిప్రాయభేదాలతో విడిపోయారు.
2022 గాంధీ జయంతిన బీహార్ లో పాదయాత్ర చేశారు. బీహార్ మొత్తం ప్రతీ గ్రామాన్ని సందర్శించాడు. అన్ని తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నాడు. వచ్చే గాంధీ జయంతికి కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్టు ప్రకటించాడు. ప్రతీ గ్రామంలో పీకేకు క్యాడర్ ఉంది. నేతలు ఉన్నారు. బీహార్ లో మీటింగ్ పెడితే ప్రతీ గ్రామం నుంచి నేతలు, కార్యకర్తలు రావడం చూసి అందరూ షాక్ అయ్యారు.
బీహార్ రాజకీయాల్ని ప్రశాంత్ కిషోర్ షేక్ చేయబోతున్నాడా? లేదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.