Congress and BRS : ఓట్ల కోసం సమాజాన్ని చీల్చడానికి.. సమాజంలో చిచ్చు పెట్టడానికి రాజకీయ నాయకులు ఏ స్థాయికైనా వెళతారని మరోసారి తెలంగాణలో రుజువైంది. ఎలాగైనా గెలవాలని దిగజారిపోతున్నారు. నానా గడ్డీకరుస్తున్నారు.
రెండు వార్తలు, రెండు రాజకీయ పార్టీలు ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి. ఒకటి హైదరాబాద్ ను యూటీ చేస్తారట.. మోడీ రెండోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారట.. రెండింటికి ఎక్కడైనా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? అని చూస్తే ఎక్కడా లేవు. రిజర్వేషన్లపై మోడీ, అమిత్ షాలు ఎన్నో సార్లు వివరణ ఇచ్చినా రేవంత్ రెడ్డి విష ప్రచారం చేస్తున్నారు.
ఇక హైదరాబాద్ యూటీ అని కేటీఆర్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఓట్ల కోసమే కేటీఆర్ ఈ కుతంత్రాలు చేస్తున్నారు.
రిజర్వేషన్ల రద్దు, హైదరాబాద్ యుటి లాంటి గాలి వార్తల్ని ఎగదోస్తున్న పార్టీలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.