Homeజాతీయ వార్తలుSchool in the Thar Desert : థార్ ఎడారిలో బాలికల కోసం ఏసీ స్కూల్.....

School in the Thar Desert : థార్ ఎడారిలో బాలికల కోసం ఏసీ స్కూల్.. మండే ఎండలో కూల్ గా.. ఎలా నిర్మించారంటే..

School in the Thar Desert : దేశంలో అత్యధిక ఎడారి కలిగిన ప్రాంతం ఏదంటే ఠక్కున చెప్పేస్తాం.. ‘థార్ ఎడారి’ అని. మిగతా ప్రాంతాల్లో వేసవి కాలంలోనే వేడి ఉంటుంది. కానీ థార్ ఎడారిలో ఎప్పుడూ ఎండ మండిపోతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతటి ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతంలో పిల్లల చదువుల కోసం ఓ పాఠశాల నిర్మించారు. అది కూడా రాజస్థాన్ లోని థార్ ఎడారి ఉండే జైసల్మార్ లోని ప్రత్యేకంగా బాలికల కోసమే నిర్మించారు. అక్కడి బాలికలు విద్యకు దూరమవుతుండడంతో కొన్ని ఫౌండేషన్లు కలిసి దీన్ని నిర్మించాయి. థార్ ఎడారిలో మాములు జనాలు ఉండడానికే ఇబ్బందులు పడుతారు. కానీ పిల్లలు ఎలా ఉండగలుగుతారు..? అనే ప్రశ్న రావచ్చు. కానీ ఏసీ భవనంలా విద్యార్థులకు చల్లటి వాతావరణం కలిగించే విధంగా స్కూల్ ను నిర్మించారు. ‘డయానా కెల్లగాన్’ అనే మహిళా డిజైన్ రూపొందించగా.. జై సల్మీర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మన్వేందర్ సింగ్ స్కూల్ కోసం 22 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఆ స్కూల్ ప్రత్యేకత ఏంటో చూద్దాం..

సాధరణంగా వేసవి కాలం రాగానే స్కూల్ విద్యార్థులకు సెలవులు ఇచ్చేస్తారు. కానీ థార్ ఎడారిలో ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా ఓ స్కూల్ భవనాన్ని నిర్మించారు. జై సల్మేర్ శామ్ డ్యూన్స్ లో కనోయ్ గ్రామ సమీపంలోని థార్ ఎడారిలో ఉంది ‘రాజకుమారి రత్నావతి’ బాలికల పాఠశాల. ఈ స్కూల్ లో 400 మంది విద్యార్థులు చదువుకునేలా కాంప్లెక్స్ నిర్మించారు. ఇందులో ఒక మ్యూజియం, రెండు ప్రదర్శన శాలలు ఉన్నాయి.

ఇందులోనే ఓ లైబ్రరీ, ఆడియో విజువల్ లెక్చర్ హాల్ కూడా ఉన్నాయి. న్యూయార్క్ కు చెందిన డయానా కెల్లగాగా డిజైన్ రూపొందిందించగా.. రిజిస్టర్ అయిన సిట్టా అనే సంస్థ ఈ స్కూల్ ను నిర్మించింది. బాలికలు మాత్రమే చదువుకునే ఇందులో వారి తల్లులకు కూడా జీవనోపాధి కల్పించే సౌకర్యం కల్పించారు. వారి ఉపాధి కోసం చేనేత, అల్లికలు, రంగులు అద్దడం లాంటి వృత్తి శిక్షణను ఇస్తారు. ఇందుకోసం ఓ భవనం కేటాయించారు.

రెండేళ్ల కిందటే ఈ స్కూల్ నిర్మాణం పూర్తయింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. కోడిగుడ్డు ఆకారంలో ఉండే ఈ స్కూల్ భవనాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఎడారి మధ్యలో వికసించిన పుష్పంలా భవనాన్ని అందంగా తీర్చిదిద్దారు. గాలి వెలుతురు సమృద్దిగా ప్రసరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శాండ్ స్టోన్ తో భవనం చుట్టూ మెష్ గోడలు నిర్మించడంతో భవనం లోపల ఏసీ వాతావరణాన్ని తలపిస్తాయి. దీంతో పిల్లలకు ఎలాంటి వేడి తాకదు. అంతటి థార్ ఎడారిలో ఏసీలో ఉండే ఇంతటి ప్రత్యేకత గల స్కూలు ఇప్పుడు వైరల్ అవుతోంది. దాని విశేషాలు తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోతున్నారు. బాలికల విద్య కోసం కొన్ని సంస్థలు చేసిన కృషి ఫలితాన్ని ఇచ్చింది. తలుచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని వీళ్లు నిరూపించారు

This is India's coolest, greenest, trendiest school and it is FREE! #OMGIndia S08E05 Story 1

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version