Ramoji Rao : లాకప్ లో గడిపిన రాజగురువు రామోజీ

Ramoji Rao : బిగినింగ్ స్టేజ్ లో మీడియా మొఘల్ లాకప్ లో గడిపారా? దేశంలోనే శక్తివంతమైన వ్యక్తిగా ఉన్న రాజగురువు కటకటలపాలయ్యారా? జైలు నుంచి వచ్చిన తరువాతే మార్గదర్శిని రిజిస్టర్ చేశారా? తరువాత ఈనాడును స్టార్ట్ చేశారా? ఇప్పుడు ఈ విషయాలపై ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఎన్నెన్నో సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. మార్గదర్శిపై పోరాడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ పలు అంశాలు పేర్కొంటూ వీడియో సంభాషణ కొనసాగింది. తెలుగునాట చర్చనీయాంశంగా మారింది.

హైప్రొఫైల్ కేసు..
గత కొన్నిరోజులుగా మార్గదర్శిపై ఉండవల్లి పోరాడుతున్న సంగతి తెలిసిందే. అటు ఏపీ ప్రభుత్వం సైతం సీబీసీఐడీ విచారణ చేపడుతోంది. దీంతో ఇదో హై ప్రొఫైల్ కేసుగా మారింది.వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి మార్గదర్శిపై విచారణ కొనసాగుతున్నా.. ఆ సంస్థ కార్యకలాపాలు మాత్రం కొనసాగిస్తూ వచ్చింది. ఖాతాదారుల నుంచి ఫిర్యాదులే లేని కేసు మాత్రం దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. అందుకు రామోజీరావు వెనుక ఉన్న ఈనాడే కారణం. రామోజీరావు రాజకీయాలను శాసిస్తుండడమే కారణం. అటు ఉండవల్లి సైతం మార్గదర్శి కేసు ద్వారానే ప్రాచుర్యం పొందారు. ఇప్పుడు ఒకే సమయంలో అటు ప్రభుత్వం ఇటు ఉండవల్లి పట్టుబిగుస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆ వీడియోలో ఉన్నది నిజమేనా?
ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఉండవల్లి సంభాషణలతో కూడిన ఓ వీడియో సందేశం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. మార్గదర్శి చిట్స్ పెట్టకముందే అనాధరైజ్డ్ గా చిట్స్ రన్ చేసిన కారణంగా అబిడ్స్ పోలీసలు రామోజీని పిలిపించి, నాలుగు రోజులు లాకప్ లో వుంచారన్న విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని ఉండవల్లి పేర్కొన్నారు. ఈ విషయం ప్రసాద్ అనే ఆయన చెప్పారని, తనకు త్వరలో పూర్తి వివరాలు ఇస్తా అన్నారని ఉండవల్లి చెప్పారు.ఈ విషయం అప్పారావు గారికి తెలుసు అని ఉండవల్లి అనడం ఆ వీడియోలో వుంది. మరి అప్పారావు ఎవరనేది ఇప్పుడు ప్రశ్న. రామోజీరావు తోడల్లుడు పేరు అప్పారావే. ఆయన డాల్ఫిన్ అప్పారావుగా పేరుంది.

మరెన్నో విషయాలు..
అయితే రామోజీరావు గురించి చాలా విషయాలు తనకు తెలుసునని ఉండవల్లి చెబుతున్నారు. ఆయన గురించి ఎన్నో ఫిర్యాదులు తనకు వస్తున్నాయని చెప్పారు. ఆయనపై పోరాడుతున్న వ్యక్తిని కావడంతో అటువంటి ఫిర్యాదులు రావడం కామనేనన్నారు. చాలా మంది ఆయన వ్యక్తిగత, సంస్థలపరమైన సమాచారాన్ని మెయిల్స్, వాట్సాప్ లో పంపిస్తున్నారని చెబుతున్నారు. అయితే వాటి విషయం పట్టించుకుంటే మార్గదర్శి అంశం పక్కకు తప్పుకునే అవకాశముందన్నారు. అందుకే వాటిని పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ వ్యవహారం వెనుక సీనియర్ ఎడిటర్ ఏబీకే ప్రసాద్ రాసిన ఒక వ్యాసం కూడా ఉందని ఉండవల్లి గుర్తుచేశారు. దీనిపై త్వరలో మీడియాతో మాట్లాడేటప్పుడు స్పష్టతనిస్తానని ఉండవల్లి చెబుతున్నారు. సో అప్పటివరకూ ఆగాలన్న మాట.

Get notified whenever we post something new!

Continue reading

AP School Hair Cut Rules: విద్యార్థులకు సరికొత్త హెయిర్ స్టైల్స్.. అలా వస్తామంటే కుదరదు!

AP School Hair Cut Rules: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు తల్లికి వందనం నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పరిస్థితుల్లో పిల్లల విషయంలో మరో నిర్ణయం ప్రకటించింది. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న బాలురుకు ఒకే తరహాలో హెయిర్ కట్ విధించాలని విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలను...

Talliki Vandanam: తల్లికి వందనం: కొద్ది గంటల్లోనే.. రూ.13 వేలు.. పేరు ఉందో లేదో చూసుకోండి!

Talliki Vandanam: ఏపీలో మరో ప్రతిష్టాత్మక పధకం అమలుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. కీలక నిర్ణయం తీసుకుంది. రేపు లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేయనుంది. తొలి విడత నిధుల విడుదల చేసే అర్హుల జాబితాను గ్రామ/ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. మరోవైపు ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది. కొత్తగా...

AP Registration Services: ‘రిజిస్ట్రేషన్’ అవినీతి తగ్గిస్తే.. వైసీపీకి ప్రైవేటీకరణట!

AP Registration Services: ఏపీలో రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ప్రభుత్వం కొన్ని రకాల మార్పులు తేవాలని నిర్ణయించింది. ఆ వ్యవస్థలో జరుగుతున్న దోపిడీకి చెక్ పెట్టేందుకు సరికొత్త విధానం ప్రారంభించేందుకు నిర్ణయించింది. సబ్ రిజిస్టర్ కార్యాలయాలు చుట్టూ ఉన్న అవినీతి మరకను తొలగించేందుకు.. దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు.. ప్రజలకు వేగంగా సేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్ సేవా...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version