spot_img
Homeజనరల్పోస్టాఫీస్ లో ఖాతా ఉన్నవారికి షాక్.. విత్ డ్రా, డిపాజిట్లపై చార్జీల వసూలు..?

పోస్టాఫీస్ లో ఖాతా ఉన్నవారికి షాక్.. విత్ డ్రా, డిపాజిట్లపై చార్జీల వసూలు..?

Post Office Latest News

దేశంలో చాలామంది పోస్టాఫీస్ ఖాతాలను కలిగి ఉన్నారు. పోస్టాఫీస్ ఖాతా ఉన్నవాళ్లు నగదు డిపాజిట్ చేయాలన్నా, విత్ డ్రా చేయాలన్నా ఎలాంటి ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదనే సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రావడంతో పాటు నగదు ఉపసంహరణలు, డిపాజిట్లలపై చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. పోస్టల్‌ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయాలను వెల్లడించింది.

Also Read: ఉద్యోగులకు ఆ రెండు కంపెనీలు శుభవార్త.. ఫ్రీగా కరోనా వ్యాక్సిన్..?

అయితే నెలకు నాలుగు సార్లు నగదు ఉపసంహరణ చేసుకుంటే ఎలాంటి ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు. అలా కాకుండా నాలుగు కంటే ఎక్కువసార్లు నగదు విత్ డ్రా చేస్తే ప్రతి లావాదేవీకి రూ.25 చొప్పున ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్యాంకుల్లో ఈ విధానం బ్యాంకుల్లో అమలులో ఉండగా పోస్టాఫీస్ లలో కూడా అమలులోకి రావడం గమనార్హం. బ్యాంకులు ఏటీఎంల నుంచి నాలుగు కంటే ఎక్కువసార్లు నగదు విత్ డ్రా చేస్తే ఛార్జీలను విధిస్తున్నాయి.

Also Read: బిచ్చగాడిగా మారిన కోటీశ్వరుడు.. అసలేం జరిగిందంటే..?

అయితే పోస్టల్ శాఖ ప్రాథమిక పొదుపు ఖాతాను కలిగి ఉన్నవాళ్లకు ఎలాంటి ఛార్జీలను వసూలు చేయదు. కరెంటు ఖాతా ఉంటే ప్రతి నెలా ఏకంగా 25 వేల రూపాయల చొప్పున విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో నెలకు పది వేల రూపాయలు ఎటువంటి ఛార్జీలు లేకుండా డిపాజిట్ చేయవచ్చు. పదివేల కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేయాలంటే లావాదేవీకి 25 రూపాయల చొప్పున చెల్లించాలి.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్‌పై కూడా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. ఐపీపీబీయేతర నెట్‌ వర్క్‌లలో నెలకు మూడు లావాదేవీలు ఫ్రీగా చేయవచ్చని మినీ స్టేట్‌ మెంట్‌ తీసుకోవడానికి ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Oktelugu Epaper
Exit mobile version