spot_img
Homeజనరల్రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. మళ్లీ ఖాతాల్లో రూ.2000..?

రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. మళ్లీ ఖాతాల్లో రూ.2000..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ లో భాగంగా మళ్లీ రైతుల ఖాతాలలో 2,000 రూపాయలు డిపాజిట్ చేయడానికి సిద్ధమైంది. గతేడాది డిసెంబర్ నెలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ఏడవ విడత నగదు జమ కాగా ఎనిమిదో విడత నగదు మార్చి నెలలో జమ కానుంది. నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్న నేపథ్యంలో నగదు జమైతే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

ఇప్పటికే మీరు పీఎం కిసాన్ స్కీమ్ కింద గతంలో జమ చేసిన సమయంలో 2,000 రూపాయలు పొందితే ఇప్పుడు కూడా 2,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం మోదీ సర్కార్ పీఎం కిసాన్ స్కీమ్ అమలులో భాగంగా 6,000 రూపాయలు జమ చేస్తోంది. ప్రతి విడతలో 2,000 రూపాయల చొప్పున మూడు విడతల్లో ఈ నగదు రైతుల బ్యాంక్ అకౌంట్ లో జమవుతుంది. అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలో ఈ నగదు జమవుతుంది.

ఏదైనా కారణం వల్ల అర్హత ఉండి ఈ నగదు జమ కాకపోతే వ్యవసాయాధికారులను సంప్రదించి పీఎం కిసాన్ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా బెనిఫీసియరీ లిస్ట్‌లో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి బెనిఫీషియరీ లిస్ట్ ఆప్షన్ ను ఎంచుకుంటే ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

రాష్ట్రం, జిల్లా, ఊరు పేరు ఎంటర్ చేసి జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోకపోయి ఉంటే ఆన్ లైన్ ద్వారా ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్, పొలం పాస్‌బుక్, ఆధార్ కార్డు ఉంటే సులభంగా ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version