Property Rights : అద్భుతమైన తీర్పు.. పిల్లలు పట్టించుకోకుంటే తల్లిదండ్రులు తమ ఆస్తులను వెనక్కి తీసుకోవచ్చు!

తన కొడుకు తనను పట్టించుకోవడం లేదని ఓ తల్లి కోర్టుకు ఎక్కింది. ఆ తల్లి ఆవేదనను అర్థం చేసుకున్న కోర్టు.. సంచలన తీర్పు ఇచ్చింది. కొడుకు చెప్పిన సాకులను న్యాయమూర్తి తోసిపుచ్చి అద్భుతమైన తీర్పు ఇచ్చారు.

Written By: NARESH, Updated On : September 10, 2023 1:02 pm

shutterstock_

Follow us on

Property Rights : తమను పట్టించుకోని పిల్లలకు తల్లిదండ్రులు బుద్ది చెప్పేలా హైకోర్టు తీర్పునిచ్చింది. ఆస్తులు పంచుకున్నాక తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకుల విషయంలో ఇదో సంచలనమైన తీర్పుగా అభివర్ణించవచ్చు.  తల్లిదండ్రులు తమ ఆస్తులను పిల్లలకు సెటిల్‌ చేసే సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పిల్లలు బాగా చూసుకోకపోతే ఆస్తిని వెనక్కి తీసుకునే హక్కు తల్లిదండ్రులకు కల్పిస్తూ   మద్రాసు హైకోర్టు అద్భుతమైన తీర్పునిచ్చింది  ఏకపక్షంగా సెటిల్‌మెంట్‌ డీడ్‌ను రద్దు చేయవచ్చని జస్టిస్‌ ఎస్‌ఎం.సుబ్రమణ్యం స్పష్టం చేశారు. ‘తల్లిదండ్రులు , సీనియర్‌ సిటిజన్ల నిర్వహణ , సంక్షేమ చట్టం కింద అవసరాలను తీర్చడానికి ఉద్దేశించింది.. ప్రేమ ,ఆప్యాయత దక్కనప్పుడు  ఆస్తులు వెనక్కి తీసుకోవచ్చని‘ అని జస్టిస్‌ పేర్కొన్నారు.

తన కొడుకు తనను పట్టించుకోవడం లేదని ఓ తల్లి కోర్టుకు ఎక్కింది. ఆ తల్లి ఆవేదనను అర్థం చేసుకున్న కోర్టు.. సంచలన తీర్పు ఇచ్చింది. కొడుకు చెప్పిన సాకులను న్యాయమూర్తి తోసిపుచ్చి అద్భుతమైన తీర్పు ఇచ్చారు.

ఆస్తి తీసుకుని..
తమిళనాడుకు మహ్మద్‌ దయాన్‌ తల్లి షకీరా బేగం చెన్నై కోర్టును ఆశ్రయించింది. తన ఆస్తి తీసుకుని తనను పట్టించుకోవడం లేదని పిటిషన్ వేసింది. విచారణ జరిపిన జడ్జి సుబ్రమణ్యం కొడుకు పేరిట రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని రద్దు చేయాలని తీర్పు ఇచ్చింది. సెటిల్‌మెంట్‌ డీడ్‌ను రద్దు చేస్తూ తిరుప్పూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు ధ్రువీకరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

వాగ్దానం చేసి…
తన కొడుకు తనను సక్రమంగా చూసుకుంటానని వాగ్ధానం చేసి సెటిల్‌మెంట్‌ డీడ్‌ను అమలు చేశాడని తల్లి కోర్టుకు తెలిపింది. హామీని నిలబెట్టుకోవాలని మహ్మద్‌ దయాన్‌ తల్లి కోర్టును కోరింది.

కొడుకు వాదన..
ఈ ఉత్తర్వును వ్యతిరేకిస్తూ, తన తల్లి ఎలాంటి షరతులు లేకుండా తనకు అనుకూలంగా 2020 అక్టోబర్‌ 20న సెటిల్‌మెంట్‌ డీడ్‌ను అమలు చేసిందని కొడుకు వాదించాడు.
‘సెటిల్‌మెంట్‌ డీడ్‌లో, పిటిషనర్‌ తండ్రి మరియు తమ్ముడు సాక్షులుగా ఉన్నారు. అతని సోదరీమణులతో పాటు అతని సోదరుడి నుండి కూడా నమోదు చేయని సమ్మతి దస్తావేజు కూడా పొందారు.l అని కోర్టుకు తెలిపాడు.

వాదనను తోసి పుచ్చుతూ..
మహ్మద్‌ దయాన్‌ వాదనను తోసిపుచ్చుతూ, జస్టిస్‌ సుబ్రమణ్యం ఇలా అన్నారు. ‘చట్టం యొక్క మొత్తం ఉద్దేశ్యం మరియు లక్ష్యం వారి పట్ల మానవ ప్రవర్తనను పరిగణనలోకి తీసుకోవడమే అన్నారు. మానవ ప్రవర్తన సీనియర్‌ సిటిజన్లపై ఉదాసీనంగా ఉన్నప్పుడు మరియు వారి భద్రత, గౌరవం రక్షించబడనప్పుడు, చట్టంలోని నిబంధనలు మార్చాలి ‘ అని స్పష్టం చేశారు.