KCR : ఎన్నికల్లో లబ్ది కోసం తిరిగి తెలంగాణ సెటిమెంట్ ను రెచ్చగొడుతున్న కేసీఆర్

ఎన్నికల్లో లబ్ది కోసం తిరిగి తెలంగాణ సెటిమెంట్ ను రెచ్చగొడుతున్న కేసీఆర్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : November 18, 2023 4:10 pm

KCR : కాంగ్రెస్ కు వేరే శత్రువులు అవసరం లేదు. వారికి వారే స్వీయనాశనం చేసుకోగల అసమర్థులు కాంగ్రెస్ వాళ్లు. నిన్నటికి నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తెలంగాణకు వచ్చి ఒక ప్రకటన చేశారు. ఏంటి ఆ ప్రకటన సారాంశం అంటే.. ‘తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారికి సారీ’ అని ఏదో సాదాసీదాగా చెప్పడం దుమారం రేపింది.

ఏదో ఒక కాంగ్రెస్ చేసిన తప్పు కోసం బీఆర్ఎస్ ఎదురుచూస్తోంది. 2019లో కాంగ్రెస్ తో చంద్రబాబు కలవడంతో దాన్ని క్యాష్ చేసుకొని గెలిచాడు కేసీఆర్. ఇప్పుడు చిదంబరం డైలాగ్ ను బీఆర్ఎస్ తెగ ప్రచారం చేస్తోంది. ఎన్నికల్లో లబ్ధి కోసం దీన్ని వాడుకుంటోంది.

తెలంగాణ ఉద్యమకారులను బలిగొన్న కాంగ్రెస్ అంటూ ఇప్పుడు చిదంబరం కూడా అంగీకరించారని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. మరి ఇదే కేసీఆర్ కుటుంబం ఒకప్పుడు సోనియా ఇంటికెళ్లి ఎందుకు కలిశారు.? కాంగ్రెస్ లో విలీనం ఎందుకు చేస్తానన్నారు. నాడు ఇదే కాంగ్రెస్ గురించి ఇంకోలా మాట్లాడే ఉండేవారా కాదా? తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న బీఆర్ఎస్ ప్లాన్ ఏమాత్రం సమర్థనీయం కాదు.

ఎన్నికల్లో లబ్ది కోసం తిరిగి తెలంగాణ సెటిమెంట్ ను రెచ్చగొడుతున్న కేసీఆర్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.