Rajamouli: ఆ ఇద్దరు డైరెక్టర్లంటే రాజమౌళికి భయమా?

జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో నెక్ట్స్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి ఈ స్థాయిలోకి వెళ్లిన కొందరు డైరెక్టర్లకు మాత్రం రెస్పెక్ట్ చేస్తుంటారు. అయితే బాహుబలి కంటే ముందే ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న జక్కన్న ఇతర డైరెక్టర్ల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.

Written By: Velishala Suresh, Updated On : January 6, 2024 3:04 pm

Rajamouli

Follow us on

Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ ను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పింది ఎవరంటే ముందుగా గుర్తుకు వచ్చేది రాజమౌళి. పాన్ ఇండియా రేంజ్ లో ఈయనకు అభిమానులు ఉన్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగినా జక్కన్న ఆర్ఆర్ఆర్ తో తన సత్తా చాటారు. అంతేకాదు ఇండియా నుంచి ఆస్కార్ అవార్డు అందుకున్న దర్శకుడు కూడా రాజమౌళినే.. ఈ అరుదైన గౌరవం సొంతం చేసుకున్న ఈ డైరెక్టర్ కు అభిమానులు ఎక్కువ. ఇండియన్ స్టైల్ మాస్ కమర్షియల్ సినిమాలకు కూడా ఆస్కార్ అవార్డులు వస్తాయని నిరూపించిన డైరెక్టర్ రాజమౌళి. ఇలా ఆయనను ఎంత పొగిడినా కూడా తక్కువే.

జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో నెక్ట్స్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి ఈ స్థాయిలోకి వెళ్లిన కొందరు డైరెక్టర్లకు మాత్రం రెస్పెక్ట్ చేస్తుంటారు. అయితే బాహుబలి కంటే ముందే ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న జక్కన్న ఇతర డైరెక్టర్ల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్ గురించి మాట్లాడారు జక్కన్న. టాలీవుడ్ లో సుకుమార్, త్రివిక్రమ్ ఎక్కువగా క్లాస్ టచ్ ఉన్న సినిమాలనే చేశారు. జక్కన్న మాట్లాడుతూ ‘‘ఇండస్ట్రీలో కరెక్ట్ గా ఫోకస్ చేసి దర్శకులు సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు మాస్ చిత్రాలు చేస్తే వాటిని మించి ఏవీ ఆడవని.. మనం సర్దుకోవాల్సిందే’’ అని చెప్పుకొచ్చారు.

ఈ ఇద్దరు డైరెక్టర్ల వద్ద స్టఫ్ ఉందని, అదృష్టం బాగుండి వారు మాస్ సినిమాలు చేయడం లేదని రాజమౌళి చెప్పడం విశేషం. జక్కన్న చెప్పిన దర్శకులలో ఇప్పటికే సుకుమార్ రంగస్థలం, పుష్ప సినిమాలతో మాస్ కమర్షియల్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ కూడా అరవింద సమేతతో మాస్ సినిమాను ప్లాన్ చేసి సక్సెస్ సాధించారు. కానీ ఈ సినిమాకు అక్కడక్కడ త్రివిక్రమ్ క్లాస్ ఫ్లేవర్ జోడించారు. కానీ గుంటూరు కారం సినిమాను కంప్లీట్ మాస్ యాక్షన్ తో ప్లాన్ చేశారు.

పోస్టర్స్, సాంగ్స్ చూస్తుంటే మాస్ కమర్శియల్ చిత్రంగానే ప్లాన్ చేశారు అని అర్థం అవుతోంది. అంతేకాదు సినిమా అద్భుతంగా వచ్చిందని నిర్మాత నాగవంశీ కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కనుక సూపర్ హిట్ అయితే మాత్రం జక్కన్న చెప్పిన ఆ ఇద్దరు డైరెక్టర్లు నిజంగానే మాస్, కమర్షియల్ సినిమాలలో బెస్ట్ అని క్లారిటీ వస్తుంది. సుకుమార్ అయితే ఇప్పటికే రాజమౌళి చెప్పింది నిజం అని పుష్పతో ప్రూఫ్ చేశారు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాతో నిరూపించుకుంటారో లేదో చూడాలి.