సమాజంలో నేటికీ కొంతమంది మగపిల్లాడు పుడితే బాగుంటుందని భావిస్తూ ఉంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆడపిల్ల పుడితే పండుగలా జరుపుకుంటారు. రాజస్థాన్ రాష్ట్రంలోని పింప్లాని గ్రామంలో ఆడపిల్ల పుడితే 111 మొక్కలు నాటుతారు. ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు మొక్కలు నాటుతారు. అలా ఎంతమంది ఆడపిల్లలు పుడితే అన్నిసార్లు మొక్కలు నాటుతారు.
Also Read: మహిళా ఉద్యోగులకు అ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. ఆరు నెలలు సెలవులు..?
ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ విధంగా మొక్కలు నాటడం వల్ల ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటాయి. మొక్కలు నాటడంతో పాటు ఆ మొక్కలు ఏపుగా పెరిగేవరకూ ఆ మొక్కల సంరక్షణ బాధ్యతలను తీసుకుంటారు. ఆడపిల్ల బర్త్ డే రోజున ఆ మొక్కలకు పూజలు చేస్తారు. పండుగ దినాల్లో సైతం ఆ మొక్కలకు పూజలు నిర్వహిస్తారు. గ్రామపెద్ద అయిన శ్యామ్ సుందర్ పాలిపాల్ మొక్కలు నాటే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
Also Read: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఇలా చేస్తే ఖాతాల్లోకి రూ.4 వేలు..?
శ్యామ్ సుందర్ పాలిపాల్ కు ఒక ఆడపిల్ల పుట్టగా ఆ పాప ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయింది. ఆ పాప జ్ఞాపకార్థం శ్యామ్ సుందర్ పాలిపాల్ 111 మొక్కలను నాటడంతో పాటు ఆ ప్రాంతమంతా చక్కగా పచ్చదనంతో వెల్లివిరిసేలా చేశారు. శ్యామ్ సుందర్ పాలిపాల్ ప్రస్తుతం పదవిలో లేకపోయినా ఆడపిల్ల పుడితే 111 మొక్కలు నాటాలి అని గ్రామస్తులంతా నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
పింప్లాన్ గ్రామం లో మూడు లక్షలకు పైగా నాటిన మొక్కలు చెట్లుగా మారాయి. ఆ గ్రామాన్ని చూసి ఇతర గ్రామాల ప్రజలు సైతం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతుండటం గమనార్హం. శ్యామ్ సుందర్ పాలిపాల్ కృషి వల్లే గ్రామానికి మంచి పేరు రావడంతో గ్రామస్తులు అతనిని ప్రశంసిస్తున్నారు.