IND vs ENG : భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను ఓటమితో మొదలు పెట్టింది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. భారత జట్టుకు బలంగా భావించే స్పిన్కే సొంత గడ్డపై తలొగ్గింది. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్లో ఆడిన ఇద్దరు క్రికెటర్ల ఆటతీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యువ క్రికెటర్లు గిల్, శ్రేయస్ అయ్యర్ ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటి వరకు 11 టెస్టు మ్యాచ్లు ఆడారు. కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడంతో వారు టెస్ట్ క్రికెట్ అవసరమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వారిని కాదని..
ఏజ్ అయిపోయింది.. భవిష్యత్ ప్రణాళిక సాకుతో టీమిండియా మేనేజ్ మెంట్ సీనియర్ క్రికెటర్లను టెస్టుకు దూరం పెట్టింది. ఆడే సత్తా ఉన్న వెటరన్ క్రికెటర్లను ఇంగ్లండ్తో టెస్ట్ మ్యాచ్కు ఎంపిక చేయలేదు. కానీ యువ రక్తం ముసలి రక్తంగా మారినట్లు కనిపిస్తోంది. ఆడాలన్న కసి, గెలవాలన్న సంకల్పం యువ క్రికెటర్లు శుభ్మన్గిల్, శ్రేయస్ అయ్యర్లో తొలి టెస్టులో ఏమాత్రం కనిపించలేదు. మరో సచిన్, మరో కోహ్లీ అంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరూ టెస్ట్ క్రికెట్ కెరీర్ అధ్వానంగా ఉంది. అయినా బీసీసీఐ ఈ ఇద్దరినీ ఎంపిక చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అయ్యర్ ప్లాప్ షో..
ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్లో శ్రేయస్ అయ్యర్ జట్టును గెలిపించేందుకు కనీస ప్రయత్నం చేయలేదు. ఇక ఆయన 11 టెస్టుల కెరీర్ పరిశీలిస్తే 11 ఇన్నింగ్స్లో (4, 12, 0, 26, 0, 31, 0, 0, 4, 31, 0) స్టోర్ చేశాడు. నాలుగుసార్లు డక్ ఔట్ అయ్యాడు. ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. అత్యధిక స్కార్ 31. ఇక అయ్యర్ బాడీ లాంగ్వేజ్ చేస్తే అసలు ఆడాలన్న ఆసక్తి అతడిలో ఏ కోశాన కనిపించలేదు. ఔట్ అయిన తర్వాత ముఖంలో బాధ కూడా లేదు.
గిల్ అంతే…
మంచి టాలెంటెడ్ క్రికెటర్గా గుర్తింపు తెచ్చుకున్న శుభ్మన్ గిల్ కూడా టెస్టుల్లో అంతంత మాత్రంగానే ఆడుతున్నాడు. గతేడాది వన్డేల్లో గిల్ ప్రత్యర్థులను వణికించాడు. టెస్టులో మాత్రం ఏడాది కాలంగా నిరాశపరుస్తున్నాడు. చివరి 11 ఇన్సింగ్స్ చూస్తే (13, 18, 6, 10, 29, 2, 26, 10, 36, 23, 0) ఇలా ఉంది. చివరి 11 ఇన్నింగ్స్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. అత్యధిక స్కోరు 36 మాత్రమే. ఇక తాజాగా ఇంగ్లండ్పై జరిగిన తొలి టెస్టులో ఈ ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. భారత ఓటమిలో కీలకంగా మారారు. మరి బీసీసీఐ ఇప్పటికైనా పునరాలోచన చేస్తుందో లేదో చూడాలి.
So called generational toilet Pill #INDvsENG #ShubmanGillpic.twitter.com/3gLos24Hb0
— Neutral Man (@RachinRavindra1) January 28, 2024
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Ind vs eng shubman gill shreyas iyer batting criticism
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com