Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచారు. ఫైనల్ లో టాప్ 3గా పల్లవి ప్రశాంత్, అమర్, శివాజీ నిలిచారు. బిగ్ బస్ హిస్టరీలోనే తొలిసారి ఒక సామాన్యుడు.. ఒక రైతు బిడ్డ విజేతగా నిలిచాడు.
నిజానికి ఇలా నిలిపింది కేవలం నటుడు శివాజీనే. తొలి వారం నుంచే ఎవరూ మాట్లాడకుండా సామాన్యుడిలా ఉన్న పల్లవి ప్రశాంత్ ను వెనకేసుకొచ్చి అతడిని సానబట్టి ఫైనల్ వరకూ తీసుకొచ్చి విజేతగా నిలిపింది శివాజీ.
ఇక అమర్ ను టార్గెట్ చేసి శివాజీ, పల్లవి ప్రశాంత్ ఏడిపించారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ కు, అమర్ కు అస్సలు పడలేదు.
అమర్ ను ఏడిపించడమే అతడిని టప్ 2 ఫైనలిస్ట్ గా మార్చింది. టీవీ ఆర్టిస్టులు, టాలీవుడ్ నుంచి అమర్ కు అత్యధికంగా ఓట్లు పడడంతో అమర్ టాప్ 2గా నిలిచారు.
ఇక బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు విజేతగా చివరకు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచి గ్రాండ్ గా టైటిల్ గెలుచుకున్నాడు.
బిగ్ బాస్ సీజన్ 7 గా నిలిచి పల్లవి ప్రశాంత్ కప్ అందుకుంటున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.. ఆ ఫొటోలు మీకోసం పైన చూడొచ్చు