Uttarakhand: మంచు మాయం.. ఓం పర్వతంపై నల్ల రాళ్ల దర్శనం.. ఆందోళన చెందుతున్న భక్తులు, పర్యాటకులు!

హిందువులచే పవిత్రమైనదిగా భావించే పర్వతాలు భారత దేశంలో అనేకం ఉన్నాయి. అందులో ఉత్తరాఖండ్‌లోని ఓం పర్వతం ఒకటి. దాని మంచు నిక్షేపణ నమూనా పవిత్రమైన ‘ఓం ’ (ॐ) ను పోలి ఉంటుంది. ఓం పర్వతం, పర్వత్‌ సరస్సు మరియు ‘జోంగ్లింగ్‌కాంగ్‌ సరస్సు‘ సమీపంలో ఉన్నాయి. జోంగ్లింగ్‌కాంగ్‌ సరస్సు హిందువులకు మానస సరోవరంలా పవిత్రమైనదిగా భావిస్తారు.

Written By: Raj Shekar, Updated On : August 29, 2024 3:53 pm

Uttarakhand

Follow us on

Uttarakhand: ఉత్తరాఖండ్‌ మంచుకొండలు ఆ మహాశివుడి నిలయంగా భావిస్తారు భక్తులు. ముఖ్యంగా ఓం పర్వతం భోలేనాథ్‌ నివాసంగా నమ్ముతారు. అలాంటి ఓం పర్వతం కొన్ని అవాంఛనీయ సంఘటనలను సూచిస్తోంది. వ్యాస్‌ లోయలో ఉన్న 14 వేల అడుగుల ఎత్తయిన ఓం పర్వతంపై మంచు క్రమంగా కరిగిపోతోంది. అప్పుడు అక్కడ చూడటానికి నల్లటి ఎత్తయిన బండరాళ్లతో కూడి కొండ మాత్రమే మిగిలి ఉంది. ఓం పర్వతం పరిస్థితి చూసి స్థానికులతో పాటు పర్యాటకులు, శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. భక్తులకు కనువిందు చేసే పర్వతం ఇప్పుడు ఎలా మాయమైందో తెలిస్తే షాక్‌ అవుతారు. ఈ ప్రకృతి అద్భుతాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి కాకుండా, ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. కానీ ఈ సంవత్సరం ప్రజలు ఇక్కడి ఓం పర్వతాన్ని చూడటానికి వచ్చినప్పుడు వారికి భిన్నమైన అనుభవం ఎదురైంది. అక్కడ ఒక పర్వతం ఉంది.. కానీ అందులో ఓం ఆకారం లేదు. ఓం ఆకారాన్ని ఎవరు తొలగిస్తారనేది అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తోంది.

ఎలా మాయమైందంటే…
గత వారం ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఓం పర్వతంపై మంచు పూర్తిగా మాయం కావడం సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి గ్లోబల్‌ వార్మింగ్‌ కారణమని నిపుణులు ఆరోపిస్తున్నారు. ఓం పర్వతంపై మంచు కరగడానికి కారణం హిమాలయాల్లో నిరంతరం పెరుగుతున్న కాలుష్యం, ఉష్ణోగ్రత అంటున్నారు పరిశోధకులు. ఐదేళ్లలో హిమాలయాల ఎగువ ప్రాంతంలో కొద్దిపాటి వర్షాలు, కొద్దిగా మంచు కురవడం, వాహన కాలుష్యం పెరుగుదల, భూతాపం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, హిమాలయాల్లోని జోలింగ్‌కాంగ్‌ను ప్రధాని గతేడాది అక్టోబర్‌లో సందర్శించిన తర్వాత పర్యాటకుల తాకిడి పది రెట్లు పెరగడం కూడా తాజా పరిస్థితికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

ఐదేళ్లుగా తక్కువ వర్షపాతం..
గత ఐదేళ్లుగా ఎగువ హిమాలయ ప్రాంతంలో తక్కువ వర్షపాతం, అక్కడక్కడా మంచు కురవడం ఓం పర్వతం నుంచి ఈ సంవత్సరం మంచు పూర్తిగా అదృశ్యం కావడానికి కారణమని అంటున్నారు. అల్మోరాలోని జిబి పంత్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ ఎన్విరాన్‌మెంట్‌ డైరెక్టర్‌ సునీల్‌ నౌటియల్‌ మాట్లాడుతూ హిమాలయ ప్రాంతంలోని పర్యావరణ సున్నిత ప్రాంతాలలో ఇంధనంతో నడిచే వాహనాల సంఖ్య పెరగడం వల్ల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మంచు కనిపించకుండా పోయిందని చెప్పారు. గత ఏడాది అక్టోబర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోలింగ్‌కాంగ్‌ను సందర్శించిన తర్వాత ఈ ప్రాంతంలో పర్యాటకుల సంఖ్య చాలా రెట్లు పెరగడం కూడా అదృశ్యానికి కారణంగా చెబుతున్నారు.