
మహమ్మారి కరోనా నేపథ్యంలో భారత్ పై విధించిన కరోనా ఆంక్షలను అమెరికా తగ్గించింది. భారత్ ను లెవల్-4 నుంచి లెవల్-2 లోకి చేర్చింది. ప్రస్తుతం భారత్ లో కరోనా పరిస్థితులు మెరుగుపడడంతో యూఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక కరోనా సెకండ్ వేవ్ సమయంలో భారత్ పై లెవల్-4 ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దేశ పౌరులను ఇండియాకు రాకుండా నిషేధించింది. అయితే, తాజాగా భారత్ లో కొవిడ్-19 తగ్గుముఖం పట్టడంతో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ లెవల్-2 ట్రావెల్ హెల్త్ నోటీసులు జారీ చేసింది.