Homeఅంతర్జాతీయంTANA Chaitanya Sravanthi : మదనపల్లిలో కొణిదెల లోకేష్ నాయుడు ఆధ్వర్యంలో తానా చైతన్య స్రవంతి

TANA Chaitanya Sravanthi : మదనపల్లిలో కొణిదెల లోకేష్ నాయుడు ఆధ్వర్యంలో తానా చైతన్య స్రవంతి

TANA Chaitanya Sravanthi In Madanapalli : తానా సేవలు చిరస్మరనీయమవుతున్నాయి.. అమెరికాలోని ప్రవాసులు చేస్తున్న సేవా కార్యక్రమాలతో తెలుగు నేల పునీతమవుతోంది. ప్రవాస తెలుగు ప్రముఖులు  రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నారు. తాము పుట్టి పెరిగిన గ్రామాలకు ఇతోదికంగా సహాయం చేస్తున్నారు. అమెరికాలో ఇంతలా ఎదిగిన వారు సొంత ఊరికోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి పేదలు, అసహాయుల అవసరాలు తీరుస్తున్నారు. తానా సభ్యులు వరుసగా చేస్తున్న సాయాలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి.

 

 

నిన్న గుంటూరులో.. అనతరం రాయలసీమలో సేవా కార్యక్రమాలు చేసిన తానా సభ్యులు ఈరోజు మదనపల్లిలోనూ తమ సేవలను అందించారు. తానా కార్య నిర్వాహక సభ్యులు కొణిదెల లోకేష్ నాయుడు గారి స్వస్థలం మదనపల్లి పట్టణంలో తానా చైతన్య స్రవంతి సందర్బంగా నిర్వహించిన సేవ కార్యక్రమాలు రెండురోజుల పాటు విజయవంతమయ్యాయి.

ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, పూర్వాధ్యక్షులు వేమన సతీష్, కన్వెన్షన కన్వీనర్ రవి పొట్లూరి, చైతన్య శ్రవంతి కోఆర్డినేటర్ సునీల్ పాంత్రా , ఇతర స్థానిక ప్రముఖులు దివంగత ముఖ్యమంత్రి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కి అంజలి ఘటించి, జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు.

తానా సాంసృతిక కళోత్సవాలో భాగంగా ప్రముఖ సినీ గాయకులు సింహ మరియు బృందం ప్రదర్శించిన మ్యూజికల్ నైట్ కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. మొదటి రోజు లోకేష్ నాయుడు గారి దాతృత్వంతో “చేయూత” “ఆదరణ” కార్యక్రమాల ద్వారా పేద మహిళలకు 15లక్షల విలువైన కుట్టు మిషన్లు, విద్యార్థినులకు సైకిళ్ళు అందజేశారు. ఎంపిక చేసిన లబ్ది దారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు.

రెండో రోజు గ్రేస్ ఫౌండేషన్ వారి సహకారంతో ఉచితం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి గారు మాట్లాడుతూ ముందు ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియచేశారు. లోకేష్ నాయుడు గారి వదాన్యతను కొనియాడారు.

మదనపల్లె పట్టణం నుంచి మరియు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులు తమకు ఆర్థిక స్వావలంబన, సాధికారత దిశగా అవకాశం కల్పించిన లోకేష్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియ జేశారు.

కొణిదెల లోకేష్ నాయుడు గారు ప్రసంగిస్తూ భవిష్యత్తులో కూడా తానా ఫౌండేషన్ ద్వారా మదనపల్లె పరిసర ప్రాంత ప్రజలకు అవసరమైన సాధికారత,సేవా కార్యక్రమాలు నిర్వహించే ప్రణాళిక ఉందని చెప్పారు

ఈ సేవాకార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, మాజీ అధ్యక్షులు, వేమన సతీష్ , సెక్రటరీ రవి పోట్లురి, తానా చైతన్య స్రవంతి కన్వీనర్ పట్ర సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తానా సభ్యులను, ప్రతినిధులను స్థానిక ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. వారిని ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమానికి తానా ప్రతినిధులు , రాజకీయ ప్రజా ప్రతినిధులు కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని నిరంజన్ నాని, రాజేష్ రాటకొండ, పెరవలి నవీన్, వంశీ నరసింహ, మహేష్ రాటకొండ కో- ఆర్డినేటర్ చేసుకొని తమ సహకారం అందచేశారు.

ఈ కార్యక్రమంలో మదనపల్లె తెలుగు దేశం పార్టీ నాయకులు రాటకొండ బాబు రెడ్డి, జయరామ నాయుడు,తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చిన్నబాబు, నాదెండ్ల విద్యాసాగర్, మధుబాబు మస్తాన్, ప్రశాంత్ కొప్పారపు, తాజ్ ఖాన్, దొరస్వామి
తదితరులు పాల్గొన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version