APTA 15th Anniversary : అమెరికాలో ఘనంగా ఆప్త 15వ వార్షికోత్సవం

అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం 6 గంటలకి కర్టెన్ రైజర్ తో వేడుకలు ఆరంభమయ్యాయి. కార్యక్రమాలలో మొదటి భాగంగా ప్రధాన దాతలు సుబ్బు కోట గారు, విజయ్ గుడిసెవా , ఉదయభాస్కర్ కొట్టే, శ్రీని బయిరెడ్డి, రావు రెమ్మల, రాజేష్ కళ్లేపల్లి, సూర్య & సత్య తోట తదితురులని సత్కరించారు.

Written By: NARESH, Updated On : September 2, 2023 11:07 am

APTA 15th Anniversary

Follow us on

APTA 15th Anniversary : ఆప్త 15వ వార్షికోత్సవ వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. గ్యాస్ సౌత్ కన్వెన్షన్ సెంటర్, అట్లాంటా మహా నగరంలో వైభవంగా ఆరంభమయ్యాయి.

ఈ వేడుకలకి దేశ విదేశాల నుంచి తెలుగు వారు, రాజకీయ నాయకులు, సినిమా తారలు, పారిశ్రామికవేత్తలు హాజరై పాలు పంచుకున్నారు.

APTA’s 15th Anniversary (5)

అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం 6 గంటలకి కర్టెన్ రైజర్ తో వేడుకలు ఆరంభమయ్యాయి. కార్యక్రమాలలో మొదటి భాగంగా ప్రధాన దాతలు సుబ్బు కోట గారు, విజయ్ గుడిసెవా , ఉదయభాస్కర్ కొట్టే, శ్రీని బయిరెడ్డి, రావు రెమ్మల, రాజేష్ కళ్లేపల్లి, సూర్య & సత్య తోట తదితురులని సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ హీరోయిన్ సమంత ప్రభు , సాయి ధర్మతేజ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. చివరిగా రఘు కుంచె తన సంగీత విభావరితో ప్రేక్షకులని ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ప్రముఖులు బొత్స సత్యనారాయణ, బండి సంజయ్, హరి ప్రసాద్ పసుపులేటి, రామ్ బంద్రెడ్డి, కళ్యాణ్ దిలీప్ సుంకర , సంగీత విధ్వాంసులు – కోటి, రఘు కుంచె, లిరిసిస్ట్- అనంత్ శ్రీరామ్ లు పాల్గొని సందడి చేశారు.

మొత్తంగా ఆప్త 15 సంవత్సరాల సంబరాలు విందు వినోదాలతో, ఆట పాటలతో కన్నుల పండువగా మొదలయ్యాయి.