Karnataka: నిశ్చితార్థానికి అడ్డుపడ్డారని ఆగ్రహం.. ఊరంతా ఉలిక్కిపడిన ఘోరం..

కర్ణాటక రాష్ట్రంలో కొడుగు జిల్లా సోమవారపేట తాలూకాలో సూర్లబ్బి అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన సురభి(పేరు మార్చాం)(16) అనే ఓ యువతి ఉంది.. సురభి ఇటీవలే పదో తరగతి పూర్తి చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 11, 2024 12:25 pm

Karnataka

Follow us on

Karnataka: ప్రేమ గుడ్డిది గాని.. అది ఎలా పుడుతుందో, ఎప్పుడు పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ, పెళ్లి అలా కాదు. పెళ్లి చేసే విషయంలో కుటుంబ సభ్యులు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూస్తుంటారు. వయసు, ఆర్థిక నేపథ్యం, కుటుంబం, కులం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుత పరిస్థితులలో వివాహానికి ఈడు జోడు తర్వాత, వయసుకే ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నారు. అలా వయసు బేధం ఎక్కువగా ఉండడంతో.. మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులు నిశ్చితార్ధాన్ని అడ్డుకున్నారు. ఇది ఆ వరుడికి నచ్చలేదు. ఇది వివాదానికి దారి తీసింది. చివరికి ఏం జరిగిందంటే..

కర్ణాటక రాష్ట్రంలో కొడుగు జిల్లా సోమవారపేట తాలూకాలో సూర్లబ్బి అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన సురభి(పేరు మార్చాం)(16) అనే ఓ యువతి ఉంది.. సురభి ఇటీవలే పదో తరగతి పూర్తి చేసింది. గురువారం విడుదలైన ఫలితాలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. యువతి తల్లిదండ్రులది పేద కుటుంబం కావడంతో ఆమెను పై చదువులు చదివించేందుకు విముఖత ప్రదర్శించారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ప్రకాష్ (32) అనే యువకుడికి సురభిని ఇచ్చి వివాహం చేయాలని ఇరువైపులా కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. అయితే అతడిని పెళ్లి చేసుకోవడం సురభికి ఇష్టం లేదు. పైగా ఇద్దరి మధ్య వయసుపరంగా సగం తేడా ఉంది. దీంతో సురభి తనకు తెలిసిన ద్వారా ఈ విషయాన్ని మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులకు చేరవేసింది.

సురభి చెప్పిన అడ్రస్ ఆధారంగా వారు ఆమె ఇంటికి వచ్చారు. నిశ్చితార్థాన్ని అడ్డుకున్నారు. సురభి సరైన వయసు రాకుండా వివాహం చేయడం తప్పని ఆమె తల్లిదండ్రులకు వివరించారు. నిశ్చితార్థం రద్దు కావడంతో ప్రకాష్ ఊగిపోయాడు. మద్యం తాగి వచ్చి ఆ రోజు సాయంత్రం సురభి తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు సురభిని బలవంతంగా అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై తన వెంట తెచ్చుకున్న మారణాయుధంతో ఆమె పై దాడి చేశాడు. దీంతో ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మొ*** నుంచి తలను వేరు చేసి తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని సురభి తల్లిదండ్రులు పోలీసులకు చెప్పడంతో, వారు అటవీ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ సురభి కోసం గాలించగా ఆమె మొ*** కనిపించింది. కొంత దూరం వారు వెళ్లి గాలించగా.. అక్కడ చేతిలో సురభి తల పట్టుకుని ప్రకాష్ చెట్టుకు ఉరివేసుకొని చనిపోయే కనిపించాడు.