
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోమవారం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం తెలిపింది. ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు పలు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఎంపీ రఘురామ వ్యవహారం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర అంశాలపై సీఎం జగన్ కేంద్ర మంత్రుల భేటీలో చర్చించే అవకాశం ఉంది.