plane crach
కేరళలో శిక్షణ విమానం కూలి ఇద్దరు నావికా సిబ్బంది ఆదివారం మృతి చెందారు. రోజువారి శిక్షణలో భాగంగా ఐఎన్ఎన్ గరుడకు చెందిన పవర్ గ్ల్లైడర్ టేకాప్ తీసుకుంది. కొద్ది సేపటి వరకు ఆకాశంలో తిరిగి ఒక్కసారిగా తొప్పుంపాడి బ్రడ్జి సమీపంలో నేలకూలింది. ఈ ఘటనలో లెప్టినెంట్ రాజీవ్ ఝా, పెట్టి ఆఫీసర్ సునీల్ కుమార్ మృతి చెందారు. విషయం తెలిసిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Also Read: కరోనా నుంచి కోలుకొనే పరిస్థితి లేదా?