బెంగుళూరు పోలీసు శాఖలో మరో విషాదం: పోలీసు దంపతుల ఆత్మహత్య

బెంగుళూరు పోలీసు శాఖలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. బెంగుళూరు కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహించే సురేశ్, షీలా శుక్రవారం విధులకు హాజరు కాలేదు. దీంతో తోటి ఉద్యోగులు ఇంటికి వెళ్లి చూసేసరికి భార్యభర్తలు వేరు వేరు గదుల్లో ఉరివేసుకొని కనిపించారు. దీంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. అయితే వీరి మరణానికి ప్రేమ పెళ్లే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా రెండు రోజుల […]

Written By: Suresh, Updated On : December 19, 2020 11:07 am
Follow us on

బెంగుళూరు పోలీసు శాఖలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. బెంగుళూరు కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహించే సురేశ్, షీలా శుక్రవారం విధులకు హాజరు కాలేదు. దీంతో తోటి ఉద్యోగులు ఇంటికి వెళ్లి చూసేసరికి భార్యభర్తలు వేరు వేరు గదుల్లో ఉరివేసుకొని కనిపించారు. దీంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. అయితే వీరి మరణానికి ప్రేమ పెళ్లే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా రెండు రోజుల కిందట సీఐడీ అధికారిణి పివి లక్ష్మీ సైతం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో బెంగుళూరు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.