దేశంలో మద్యాహ్నం భోజన పథకం అమలు కావడం లేదని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. లాక్డౌన్ కారణంగా అంగన్వాడీ కేంద్రాలు మూసివేశారని, దీంతో మధ్యాహ్నం భోజనం అందక విద్యార్థులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై స్పందించిన సుప్రీం రెండు వారాల్లోగా అపిఢవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు పంపించింది.