పుల్వామా దాడిలో తమ ప్రమేయం ఉందని పాక్ ఒప్పుకోవడంతో కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. పూల్వామా దాడి ఆ దేశ ఘన విజయంగా ఆ దేశ సీనియర్ మంత్రి ఫవాద్ చౌధురి పార్లమెంట్లో ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో పూల్వామా దాడి అధికార పార్టి కుట్ర అని గతంలో కాంగ్రెస్ సహా విపక్షాలు చేసిన ఆరోపణలపై క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.