జమ్మూకాశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత..

జమ్మూకాశ్మీర్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. తాజాగా శ్రీనగర్‌లోని రామ్‌బాగ్‌లో ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అయితే ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడడంతో ప్రతిగా సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు కూడా కాల్పలు జరిపారు. అయితే వారిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఒకరు పాకిస్థాన్‌కు చెందిన సైపుల్లా, మరొకరు జమ్ముకు చెందినవారిగా గుర్తించారు. వారిద్దరు లష్కరే తోయిబాకు చెందినవారని పోలీసులు ప్రకటించారు. దీంతో ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్‌ […]

Written By: Velishala Suresh, Updated On : October 12, 2020 12:45 pm
Follow us on

జమ్మూకాశ్మీర్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. తాజాగా శ్రీనగర్‌లోని రామ్‌బాగ్‌లో ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అయితే ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడడంతో ప్రతిగా సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు కూడా కాల్పలు జరిపారు. అయితే వారిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఒకరు పాకిస్థాన్‌కు చెందిన సైపుల్లా, మరొకరు జమ్ముకు చెందినవారిగా గుర్తించారు. వారిద్దరు లష్కరే తోయిబాకు చెందినవారని పోలీసులు ప్రకటించారు. దీంతో ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుందని భద్రతా బలగాల అధికారులు తెలిపారు.