Bangladesh election results: బంగ్లాదేశ్లో 18 నెలల తర్వాత మార్పు రాబోతోంది. ఫిబ్రవరి 12న పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. షేక్ హసీనా పతనం తర్వాత 18 నెలల అస్థిరతకు తెరపడనుంది. బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధించింది. తారీఖ్ రహ్మాన్ నేతృత్వంలో కొత్త పాలన ఆరంభం ద్వారా భారత వ్యతిరేక శక్తులు బలహీనపడ్డాయి.
యూనస్ పాలనలో ఉద్రిక్తతలు
మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం చైనా, పాకిస్తాన్ మద్దతుతో భారత్తుపై విద్వేషాలు రేకెత్తించింది. సిలిగురి కారిడార్, సెవెన్ సిస్టర్స్ వంటి సున్నిత అంశాలు, హిందూ సమాజంపై దాడులు ద్విపక్ష సంబంధాలను దెబ్బతీశాయి. విద్యార్థి నేతల హత్యలు భారత వ్యతిరేక ప్రచారంగా మారాయి.
బీఎన్పీ విజయతో..
తారీఖ్ రహ్మాన్ తిరిగి దేశానికి వచ్చి తొలి సమావేశంలో హిందువుల స్వేచ్ఛకు హామీ ఇచ్చారు. మరోవైపు పాక్ అనుకూల జమాత్–ఏ–ఇస్లామీని ప్రజలు తిరస్కరించారు. ఎన్నికల్లో గెలిచిన తారీఖ్ రహ్మన్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక యూనస్ కూడా తారీఖ్ ఎన్నికను ప్రశంసించారు.
పాకిస్తాన్ ఏడుపు..
ఇదిలా ఉంటే జియో పాలిటిక్స్లో పాక్లో కీలక పరిణామాలు జరుగుతున్నా. ఆ దేశ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అమెరికా తమను ‘టాయిలెట్ పేపర్’లా వాడుకుంఓటందని ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యా విధానంలోనూ 1998 నుంచి అమెరికా ఆధిపత్యం చెలాయిస్తోందని, అమెనికా అనుకూల పాఠాలే బోధింస్తోందని తెలిపారు. బార్సినరీ వంటి ఆరోపణలు పాక్ బలహీనతను తెలియజేస్తున్నాయి.
భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం..
ఇక ఇటీవల కుదిరిన భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంలోని కఠిన నిర్ణయాలను అమెరికా ఉపసంహరించుకుంది. 500 బిలియన్ డాలర్ నిబంధన తొలగించింది. పల్స్, ఫార్మా ఎగుమతులపై జీరో టారిఫ్ హామీలు ఇచ్చింది. ఈ డీల్తో ఎగుమతులు 40 నుంచి 80 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం. అఖండ భారత మ్యాప్ వివాదం తొలగించారు. రష్యా ఆయిల్ చర్చలు కొనసాగుతున్నాయి.
ట్రంప్ విధానాల ప్రభావం
ట్రంప్ వ్యాపార ఒత్తిడి విధానం దేశాలను కలవరపెడుతోంది. ఎఫ్స్టీన్ ఫైల్స్లో పేరు, ఇరాన్ యుద్ధ సూచనలు వివాదాలు సృష్టిస్తున్నాయి. అమెరికా ప్రయోజనాలు పైన పెట్టుకుని మిత్ర–శత్రువులను ఒత్తిడి చేస్తోంది.
బీఎన్పీ పాలన భారత్తో సహకారాన్ని పెంచి, పొరుగు స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. పాక్ బలహీనత, అమెరికా ఒప్పందాలు భారత వాణిజ్యానికి ఊరట ఇస్తాయి. రష్యా మిత్రత్వం కొనసాగుతూ ట్రంప్ అనిశ్చితులను సమతుల్యం చేస్తాయి. దీర్ఘకాలంలో ప్రాంతీయ భద్రత పెరుగుతుంది.