అప్పుల్లో కేంద్రం.. ఇక ప్రజలకు ప్యాకేజీలు లేవట?

కరోనా మహమ్మారితో ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. మన భారత ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. ఏకంగా మైనస్ లలోకి చేరాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 9 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని గ్లోబల్ రేటింగ్ ఎస్ అంద్ పీ అంచనావేసింది. Also Read: మీ ఆస్తులు ఇక భద్రం: ఓనర్‌‌ లేకున్నా ఇంటికొచ్చి నమోదు చేస్తారు ప్రభుత్వానికి కరోనాతో ఆదాయం పడిపోయిన నేపథ్యంలో రుణ లక్ష్యం రూ.12 […]

Written By: NARESH, Updated On : October 1, 2020 2:47 pm

central debts

Follow us on

కరోనా మహమ్మారితో ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. మన భారత ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. ఏకంగా మైనస్ లలోకి చేరాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 9 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని గ్లోబల్ రేటింగ్ ఎస్ అంద్ పీ అంచనావేసింది.

Also Read: మీ ఆస్తులు ఇక భద్రం: ఓనర్‌‌ లేకున్నా ఇంటికొచ్చి నమోదు చేస్తారు

ప్రభుత్వానికి కరోనాతో ఆదాయం పడిపోయిన నేపథ్యంలో రుణ లక్ష్యం రూ.12 లక్షల కోట్లకు కట్టుబడి ఉన్నట్టు చెబుతున్నారు. రుణాల్లో మార్పు లేదని ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతానికి కేంద్రం భారీ ఉద్దీపనకు ముందుకు వెళ్లకపోవచ్చని భావిస్తున్నారు.

బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం ఆగస్టు చివరి నాటికి కేంద్ర ఆర్థిక ద్రవ్యలోటు రూ.8.7 లక్షల కోట్లుగా ఉంది. పూర్తి ఏడాదికి బడ్జెట్ లో అందించిన రూ.7.96 లక్షల కోట్ల కంటే 9.3శాతం ఎక్కువ. అయితే ద్రవ్యలోటు రూ.14 లక్షల కోట్ల నుంచి రూ.18 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చునని నిపుణుల అంచనా.

ఇప్పటికే కేంద్రం సెప్టెంబర్ తో ముగిసిన ప్రథమార్థంలో రూ.7.66 లక్షల కోట్ల రుణం తీసుకుంది. ఈ ఏడాది రూ.12 లక్షల కోట్ల రునాలు తీసుకుంటామని మే నెలలో ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కారణంగా దీనిని 50శాతం పెంచి రూ.12 లక్షల కోట్లకు పెంచవలసిన పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) ద్వితీయార్థంలో కేంద్ర ప్రభుత్వం రూ.4.34 లక్షల కోట్ల అప్పులు చేయనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12 లక్షల కోట్ల రుణ లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు.

Also Read: బాబును మించిపోయిన జగన్.. అప్పుల్లో ఏపీ సరికొత్త రికార్డు

కరోనా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. దీంతో కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు కూడా అప్పులు చేయక తప్పడం లేదు. ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా లక్షల కోట్లు అప్పులు చేస్తున్నట్టు తాజాగా ఆర్థిక శాఖ తెలుపడంతో ఇక భవిష్యత్తులో పరిశ్రమలకు, ప్రజలకు ప్యాకేజీలు ఇవ్వడం కుదరదని తేలిపోయింది.