spot_img
HomeజాతీయంSouthwest Monsoon: మండే ఎండలు.. వానమ్మ జాడేది? నైరుతి రాకపై షాకింగ్ న్యూస్

Southwest Monsoon: మండే ఎండలు.. వానమ్మ జాడేది? నైరుతి రాకపై షాకింగ్ న్యూస్

Southwest Monsoon: రోహిణి కార్తె సగానికి వచ్చింది. మే నెలను మరిపిస్తూ ఎండ దంచి కొడుతోంది. బయటికి వెళ్లాలంటేనే భయం వేస్తోంది. నగరం, గ్రామం అని తేడా లేకుండా 46కు మించి డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ ఏడాది ఎల్ నీనో ముప్పు ఉంటుంది అని భారత వాతావరణ శాఖ చెప్పినట్టే జరుగుతోంది. దేశంలో నైరుతి రుతుపవనాలు ఇంకా ప్రవేశించ పోవడం ఆ పరిస్థితిని ధ్రువపరుస్తోంది. వాస్తవానికి జూన్ 4నే కేరళ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకాలి. అక్కడి నుంచి అవి దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. ఫలితంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. మన దేశంలోని సుమారు 90 శాతం వ్యవసాయానికి ఈ నైరుతి రుతుపవనాలే ఆధారం.

వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారంటే

నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని ఇంకా తాకకపోవడంతో భారత వాతావరణ శాఖ అధికారులు స్పందించారు. దక్షిణ అరేబియా సముద్రంలో పడమటి గాలులు పెరుగుతున్నాయని, పరిస్థితులు అనుకూలంగానే ఉన్నప్పటికీ నైరుతి రుతుపవనాలు కేరళ తాకపోవడం పట్ల వారు కూడా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. పడమటి గాలుల లోతు కూడా క్రమంగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. జూన్ 4 నాటికి సముద్రమట్టానికి వాటి విస్తీర్ణం 2.1 కిలోమీటర్లకు చేరుకుందని, ఆగ్నేయ అరేబియా సముద్రంలో మేఘాలు కూడా పెరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. దీనివల్ల రుతుపవనాలు కేరళను తాకే పరిస్థితులు మెరుగయ్యాయని వారు చెబుతున్నారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రతిభవనాలు ఇంకా కేరళ రాష్ట్రాన్ని తాకలేదు. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా దేశంలో ప్రవేశిస్తే.. అది మొత్తం వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈసారి అలా ఉంటుందా

గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో మంచి వర్షపాతం నమోదు అవుతోంది. ఫలితంగా కొత్త ఆయకట్టు కూడా సాగులోకి వచ్చింది. నీటి లభ్యత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొత్త ప్రాజెక్టులు చేపట్టాయి. అయితే ఈ ఏడాది ఎల్ నీనో ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. వారు హెచ్చరికలు చేసినట్టుగానే ఈ ఏడాది నిర్ణీత సమయంలో రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకలేదు. దీనికి తోడు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న నేపథ్యంలో రైతుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. మనదేశంలో మెజారిటీ వ్యవసాయం రుతుపవనాల మీద ఆధారపడి ఉందని, అవి ఈ ఏడాది పసిఫిక్ సముద్రంలో ఏర్పడిన ఎల్ నీనో వల్ల ముఖం చాటేస్తే కరువు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

America Politics: అమెరికాకు యువ అధ్యక్షురాలు.. పోల్స్ తో ఈ 36 ఏళ్ల మహిళకే ఓటు

America Politics: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అయింది. నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అంతకుముందు జోబైడెన్‌ అధ్యక్షుడిగా...

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version