https://oktelugu.com/

అభిమానులకు `డేటింగ్’ ఆఫర్ ఇచ్చిన త్రిష

21 ఏళ్ళ క్రితం అంటే 1999 లో ప్రశాంత్ , సిమ్రాన్ జంటగా నటించిన ” జోడి ” చిత్రం ద్వారా నటిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన త్రిష తెలుగులో ప్రభాస్ సరసన ‘వర్షం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ తరవాత “‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా ” సినిమాతో యూత్‌కు దగ్గరైంది …తెలుగులో నటించడం తగ్గినప్పటికీ కోలీవుడ్‌లో ఇప్పటికీ టాప్ స్టార్‌గానే కొనసాగుతోంది. అలాంటి హీరోయిన్ త్రిష ఫాన్స్ కి బంపర్ అఫర్ ఇచ్చింది . స్టార్ […]

Written By: , Updated On : April 30, 2020 / 10:48 AM IST
Follow us on


21 ఏళ్ళ క్రితం అంటే 1999 లో ప్రశాంత్ , సిమ్రాన్ జంటగా నటించిన ” జోడి ” చిత్రం ద్వారా నటిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన త్రిష తెలుగులో ప్రభాస్ సరసన ‘వర్షం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ తరవాత “‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా ” సినిమాతో యూత్‌కు దగ్గరైంది …తెలుగులో నటించడం తగ్గినప్పటికీ కోలీవుడ్‌లో ఇప్పటికీ టాప్ స్టార్‌గానే కొనసాగుతోంది. అలాంటి హీరోయిన్ త్రిష ఫాన్స్ కి బంపర్ అఫర్ ఇచ్చింది .

స్టార్ హీరో రిషి కపూర్ ఆకస్మిక మృతి

‘నేను చాలారోజులుగా ఎవ్వరితోనే డేటింగ్ చేయడం లేదు… మీకు నాపైన ఇంట్రెస్ట్ ఉంటే… ఓ 500 పదాలతో వ్యాసం రాయండి. మీరు నా సమయాన్ని వృథా చేయకుండా ఎలా చూసుకుంటున్నారో ఈ వ్యాసంలో వివరించి, ఇంప్రెస్ చేయండి’ అంటూ తన ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది .

ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి

త్రిష కొన్నాళ్ల కిందట చెన్నైకి చెందిన ఓ బడా బిజినెస్‌మ్యాన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకొని ఆ తరువాత క్యాన్సిల్ చేసుకొంది. అలాగే దగ్గుబాటి రానా తో డేటింగ్ కూడా చేసింది ..ఇప్పుడు తాజాగా ఫ్యాన్స్‌కు డేటింగ్ ఆఫర్ ఇవ్వడం చూస్తుంటే 36 ఏళ్ల త్రిష,కు , లాక్‌డౌన్‌లో బోర్ కొట్టి…ఇలా అభిమానులతో పరాచికాలు ఆడుతోందని సినీ విమర్శకులు అంటున్నారు. అయితే త్రిష పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్న మాట మాత్రం వాస్తవమే అని తెలుస్తోంది. నిజానికి నటిగా త్రిష కోలీవుడ్‌లో ఐదు, మలయాళంలో ఓ సినిమా చేస్తూ బిజీగానే ఉంది. మధ్యలో ఈ ప్రకటనే ఎవ్వరికీ అంతు పట్టడం లేదు.