ప్రభాస్ ను లైన్లో పెట్టిన నాగ్ అశ్విన్

‘బహుబలి’ సీరీస్ లతో హీరో ప్రభాస్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు. ఆయనతో కలిసి పని చేసేందుకు అగ్ర దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే డార్లింగ్ మాత్రం ఆచితూచి సినిమాలకు కమిట్ అవుతున్నాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలనే చేస్తూ బీజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొనసాగుతుండగానే ప్రభాస్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘మహానటి’ మూవీతో దర్శకుడు నాగ్ […]

Written By: Neelambaram, Updated On : February 28, 2020 1:36 pm
Follow us on

‘బహుబలి’ సీరీస్ లతో హీరో ప్రభాస్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు. ఆయనతో కలిసి పని చేసేందుకు అగ్ర దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే డార్లింగ్ మాత్రం ఆచితూచి సినిమాలకు కమిట్ అవుతున్నాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలనే చేస్తూ బీజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొనసాగుతుండగానే ప్రభాస్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

‘మహానటి’ మూవీతో దర్శకుడు నాగ్ అశ్విన్ జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఆయన ఏ సినిమాను చేయలేదు. అయితే తాజాగా డార్లింగ్ ప్రభాస్ తో సైంటిఫిక్ ఫిక్షన్ బ్యాక్ గ్రాప్ లో ఓ మూవీ తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన చిత్రబృందం బుధవారం ప్రకటించింది. దీంతో నాగ్ అశ్విన్ తో ప్రభాస్ మూవీపై క్లారిటీ వచ్చేసింది.

ఇటీవల ప్రభాస్ నటించిన ‘సాహో’ మూవీ ‘బహుబలి’ రికార్డులను తిరగరాస్తుందని అనుకున్నారు. అయితే ఆ రేంజ్లో కాకపోయిన మంచి విజయాన్నే దక్కించుకుంది. ఈ మూవీ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్నాడు. ప్రభాస్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ మూవీని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ మూవీ ప్రారంభం కానుంది.