
ఒక్క కార్పొరేషన్కు జరుగుతున్న ఎన్నికలు ఇవి. కానీ.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలోనూ ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అంతేకాదు.. జాతీయ స్థాయి లీడర్లు వచ్చి ప్రచారంలో పాలు పంచుకుంటున్నారంటే పోటీ ఎంత ఆసక్తికరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఈ ఎన్నికలకు ఇంత హైప్ రావడానికి గల కారణం కూడా బీజేపీనే. ఎప్పుడు జరిగే ఎన్నికల్లాగే వన్సైడ్ జరుగుతాయని అందరిలోనూ ఉన్న అభిప్రాయాన్ని బీజేపీ కాస్త తొలగించింది. ఆ పార్టీ అనుసరించిన వ్యూహం టీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసింది. మరీ ముఖ్యంగా కేసీఆర్ మిస్ అవుతున్నదేమిటో కూడా ఆ పార్టీ చెప్పినట్లైంది.
Also Read: కేసీఆర్ వల్లే బీజేపీ బలపడిందా..?
రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కేసీఆర్ ముందుగా ప్రజల భావద్వేగాలను టార్గెట్ చేసేవారు. ముందుగా తెలంగాణవాదాన్ని తెరమీదకు తెచ్చి.. ఎన్నికల ఎజెండాను సిద్ధం చేయటంలో టీఆర్ఎస్ ముందుండేది. అది వేసిన బాటలో మిగిలిన పార్టీలు నడిచేవి. తొలిసారి అందుకు భిన్నమైన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. తాను విసిరిన వలలో టీఆర్ఎస్ పార్టీ చిక్కుకునేలా చేయటంలో సక్సెస్ అయ్యారు కమలనాథులు. తొలిసారి తాను ఎజెండా ఫిక్స్ చేస్తే.. దానికి అనుగుణంగా టీఆర్ఎస్ అడుగులు వేయటం ఈ ఎన్నికల్లో కనిపించింది. నిన్నటివరకు హాట్హాట్గా ప్రచారం సాగింది. రేపు పోలింగ్ జరగబోతోంది. దీంతో ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుచుకునే స్థానాల కంటే కూడా బీజేపీ విజయం సాధించే డివిజన్లు ఎన్ని అన్న అంశం పైనే చర్చ సాగుతోంది. మరి.. ఆ లెక్క తెలుసుకునేదెలా? దానికి సంబంధించిన సంకేతాలు ఏమైనా ఉన్నాయా?
Also Read: హరీష్ కథ ముగిసినట్లేనా..?
2016లో గ్రేటర్ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో పోలింగ్ శాతం 45 శాతం కంటే తక్కువ. అప్పట్లో టీఆర్ఎస్ కు అత్యధికంగా 99 స్థానాల్ని సొంతం చేసుకోగా.. మజ్లిస్ రెండో స్థానంలో నిలిచింది. తాజా ఎన్నికల పోలింగ్ 50 శాతానికి పైగా నమోదైతే.. అది కచ్చితంగా బీజేపీకే ప్రయోజనకరంగా మారుతుందని చెబుతున్నారు. ఎందుకంటే.. ఇప్పుడు జరుగుతున్న గ్రేటర్ ఎన్నికలు భావోద్వేగంతో కూడుకున్నవిగా చెప్పాలి. ఈ కారణంగా బీజేపీని తప్పనిసరిగా గెలిపించాలని అనుకున్న వారంతా ఓట్లు వేయటం ఖాయం. ఈ సెక్షన్ ఎంత ఎక్కువ వేస్తే.. అంత ఎక్కువ పోలింగ్ శాతం పెరిగే వీలుంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం: తెలంగాణ పాలిటిక్స్
ఇక అధికారపక్షం విషయానికి వస్తే.. గత ఎన్నికల వేళలో నమోదైన పోలింగ్ శాతం కానీ.. అంతకంటే తక్కువగా నమోదైతే మాత్రం టీఆర్ఎస్ కు అనుకూలంగా ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మరి.. పోలింగ్ నమోదు ఎంతన్నది తేలాలంటే మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు వెయిట్ చేయాల్సింది. పక్కా ఫిగర్ రాత్రి 8 నుంచి 9 గంటలకు మాత్రమే వచ్చే వీలుంది. మొత్తంగా పోలింగ్ శాతమే గెలుపోటములను నిర్ణయించనుందన్నమాట.