బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ విశ్వవ్యాప్తమైంది. అందుకే వరుసగా అవకాశాలు అలానే వస్తున్నాయి. ప్రభాస్ సినిమాలు కూడా అన్నీ ప్యాన్ ఇండియా మూవీలనే ఎంపిక చేసుకుంటున్నాడు. హిందీ ఫేమస్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో ప్రస్తుతం ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
అయితే రామాయణం ఆధారంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం రోజే భారీ ప్రమాదం చోటుచేసుకోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. దీంతో కోట్ల రూపాయల భారీ నష్టం కూడా వాటిల్లినట్టు వార్తలు వచ్చాయి.
అయితే ఆదిపురుష్ షూటింగ్ లో జరిగింది అగ్ని ప్రమాదం కాదని.. కుట్ర దాగి ఉందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
హిందీ హీరో సైఫ్ అలీఖాన్ పై ఓవర్గం వారు మండిపడడం.. ఆయన రావణుడి పాత్రను పోషించడాన్ని కొందరు వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నట్టు మండిపడడం.. సోషల్ మీడియాలో దీనిపై దుమారం రేగుతోంది. . ఈ సినిమా బ్యాన్ చేస్తామంటున్నారు.
ఆ మధ్య సైఫ్ అలీఖాన్ ‘రావణాసురుడిలోని మానవత్వ కోణాన్ని ఆవిష్కరించే విధంగా సినిమాలో చూపించబోతున్నామని.. రాముడితో ఎందుకు యుద్ధం చేశాడు.. రావణుడు తీసుకున్న నిర్ణయం ఒప్పు అనే కోణంలో సినిమా ఉంటుందని’ సైఫ్ హిందువుల రామయాణాన్ని వక్రీకరించాడు. ఇది పెద్ద దుమారం రేపింది. దీంతో సైఫ్ అందరికీ క్షమాపణలు చెప్పాడు.
ఈ క్రమంలో ఈ ఆగ్రహ జ్వాలలను చల్లార్చాలనే ఆదిపురుష్ సెట్స్ కు నిప్పటించి ఉండొచ్చని కథనాలు వెలువడుతున్నాయి.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ రామయణ కథను వచ్చే ఏడాది ఆగస్టు 11కు విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.