RahulvsModi
దీనిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ భారత ప్రజాస్వామ్యం గొంతును నొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రధాని మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. పార్లమెంటులో ఈ బిల్లును పెట్టే ముందు కనీసం రైతులను కేంద్రం సంప్రదించలేదని ఆరోపించారు. ఈ బిల్లు నూటికి నూరుపాళ్లు రైతులకు వ్యతిరేకంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యసభలో 8మంది సభ్యులను ప్రభుత్వం సస్పెండ్ చేయడం బీజేపీ సర్కార్ దుహంకారానికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం మోదీ సర్కార్ తీసుకొచ్చిన బిల్లులు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు. కేంద్రం ఈ బిల్లులను అమలు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలతో దేశ ఆర్థిక దివాళా తీసిందన్నారు. తాజాగా రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని తీవ్రస్థాయిలో రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.