Homeలైఫ్ స్టైల్Monsoon: రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి? ఎందుకు ఆలస్యమవుతున్నాయి?

Monsoon: రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి? ఎందుకు ఆలస్యమవుతున్నాయి?

Monsoon: నైరుతి రుతుపవనాలు ఈసారి ఆలస్యం చేస్తున్నాయి. జూన్ లోనే రాష్ట్రమంతటా విస్తరించి వర్షాలు జోరుగా కురిసే తొలకరి ఈ దఫా ఎందుకో తటపటాయిస్తోంది. దీంతో రైతులు వానల కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. తొలకరి కురిస్తేనే సాగుకు సమాయత్తం అవుతారు. అందుకే ఎప్పుడు వర్షాలు పడతాయనే కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. మన దేశం వ్యవసాయాధారిత దేశం కావడంతో వర్షాలే మనకు ప్రధాన నీటి వనరుగా ఉంటున్నాయి. దీంతో వర్షాలు పడితేనే సాగు పనులు ముందుకు సాగేది. అందుకే రైతులు వర్షాలు కురవాలని కోరుకుంటున్నారు.

Monsoon
Rains

కానీ ప్రకృతి మాత్రం కనికరించడం లేదు. రుతుపవనాలు చురుగ్గా కదలడం లేదు. ఫలితంగా రాష్ట్రానికి రుతుపవనాల రాక 14 తరువాతే అని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీంతో రైతులకు ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదు. సాగు మరింత ఆలస్యమవుతుందని కంగారు పడుతున్నారు. సరైన సమయంలో వర్షాలు పడితేనే పంటలు కూడా సమృద్ధిగా పండుతాయని తెలిసిందే. దీంతో ఈసారి వర్షాలు మరింత ఆలస్యం చేస్తూ రైతులను కంగారు పెడుతున్నాయి.

Also Read: AP Political Parties: జనాల్లోకి ఏపీ రాజకీయ పార్టీలు.. ప్లాన్ఏంటి?

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ బాధలు ఈనెల 14 వరకు ఉంటాయని తెలుస్తోంది. దీంతో రుతుపవనాల ఆలస్యంగా రావడానికి బంగాళాఖాతంలో ఏర్పడే పరిస్థితులే కారణమని చెబుతున్నారు. జూన్ రెండో వారంలో ఉన్నా ఎండలు ఇంకా ఎక్కువగానే ఉంటున్నాయి. దీంతో రైతుల కళ్లల్లో నిరాశే కనిపిస్తోంది. రుతుపవనాల రాక ఇంకా ఆలస్యమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి.

Monsoon
Farmer

అదను దాటితే వ్యవసాయం అంతగా పనికి రాదు. అందుకే సమయానికి విత్తనాలు పడితేనే పంట దిగుబడి బాగా వస్తుంది. రైతుకు మేలు జరుగుతుంది. కానీ ఈ సారి రైతులకు నష్టమే కలిగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈనెల 14 తరువాతే వానలపై ఓ స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రుతుపవనాల జాడ ఇకనైనా కనిపిస్తుందా అని అన్నదాతలు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు.

Also Read: Himba Tribe: హింబా తెగ: జీవితంలో ఒక్కసారే స్నానం చేస్తారు.. ఎందుకో తెలుసా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version