Homeలైఫ్ స్టైల్Monsoon: రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి? ఎందుకు ఆలస్యమవుతున్నాయి?

Monsoon: రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి? ఎందుకు ఆలస్యమవుతున్నాయి?

Monsoon: నైరుతి రుతుపవనాలు ఈసారి ఆలస్యం చేస్తున్నాయి. జూన్ లోనే రాష్ట్రమంతటా విస్తరించి వర్షాలు జోరుగా కురిసే తొలకరి ఈ దఫా ఎందుకో తటపటాయిస్తోంది. దీంతో రైతులు వానల కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. తొలకరి కురిస్తేనే సాగుకు సమాయత్తం అవుతారు. అందుకే ఎప్పుడు వర్షాలు పడతాయనే కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. మన దేశం వ్యవసాయాధారిత దేశం కావడంతో వర్షాలే మనకు ప్రధాన నీటి వనరుగా ఉంటున్నాయి. దీంతో వర్షాలు పడితేనే సాగు పనులు ముందుకు సాగేది. అందుకే రైతులు వర్షాలు కురవాలని కోరుకుంటున్నారు.

Monsoon
Rains

కానీ ప్రకృతి మాత్రం కనికరించడం లేదు. రుతుపవనాలు చురుగ్గా కదలడం లేదు. ఫలితంగా రాష్ట్రానికి రుతుపవనాల రాక 14 తరువాతే అని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీంతో రైతులకు ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదు. సాగు మరింత ఆలస్యమవుతుందని కంగారు పడుతున్నారు. సరైన సమయంలో వర్షాలు పడితేనే పంటలు కూడా సమృద్ధిగా పండుతాయని తెలిసిందే. దీంతో ఈసారి వర్షాలు మరింత ఆలస్యం చేస్తూ రైతులను కంగారు పెడుతున్నాయి.

Also Read: AP Political Parties: జనాల్లోకి ఏపీ రాజకీయ పార్టీలు.. ప్లాన్ఏంటి?

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ బాధలు ఈనెల 14 వరకు ఉంటాయని తెలుస్తోంది. దీంతో రుతుపవనాల ఆలస్యంగా రావడానికి బంగాళాఖాతంలో ఏర్పడే పరిస్థితులే కారణమని చెబుతున్నారు. జూన్ రెండో వారంలో ఉన్నా ఎండలు ఇంకా ఎక్కువగానే ఉంటున్నాయి. దీంతో రైతుల కళ్లల్లో నిరాశే కనిపిస్తోంది. రుతుపవనాల రాక ఇంకా ఆలస్యమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి.

Monsoon
Farmer

అదను దాటితే వ్యవసాయం అంతగా పనికి రాదు. అందుకే సమయానికి విత్తనాలు పడితేనే పంట దిగుబడి బాగా వస్తుంది. రైతుకు మేలు జరుగుతుంది. కానీ ఈ సారి రైతులకు నష్టమే కలిగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈనెల 14 తరువాతే వానలపై ఓ స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రుతుపవనాల జాడ ఇకనైనా కనిపిస్తుందా అని అన్నదాతలు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు.

Also Read: Himba Tribe: హింబా తెగ: జీవితంలో ఒక్కసారే స్నానం చేస్తారు.. ఎందుకో తెలుసా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper