spot_img
Homeఎడ్యుకేషన్TS EAMCET Results 2023: తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ విద్యార్థుల సత్తా.. టాప్‌ ర్యాంకులన్నీ వారికే!

TS EAMCET Results 2023: తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ విద్యార్థుల సత్తా.. టాప్‌ ర్యాంకులన్నీ వారికే!

TS EAMCET Results 2023: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలను ప్రభుత్వం ప్రకటించింది. మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నీట్‌ పరీక్ష ఉండటంతో ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌ సీట్ల భర్తీ కోసమే ఎంసెట్‌ నిర్వహిస్తున్నారు. గురువారం ప్రకటించిన తెలంగాణ ఎసెంట్‌ ఫలితాల్లో టాప్‌ ర్యాంకులన్నీ ఏపీ విద్యార్థులకే దక్కాయి. ఇంజినీరింగ్‌లో టాప్‌ టెన్‌ ర్యాంకుల్లో ఒక్క విద్యార్థి మాత్రమే నల్లగొండకు చెందిన విద్యార్థి ఉంది. ఏడో ర్యాంక్‌ శాశ్వితా రెడ్డి మాత్రమే నల్లగొండ.. మిగతా అందరూ ఏపీకి చెందినవారే. అగ్రికల్చర్‌ ర్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి. అగ్రికల్చర్, మెడికల్‌ ర్యాంకుల్లో ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా.. మిగతా ఏడుగురు ఏపీకి చెందినవారే.

తెలంగాణలో చదవాలని..
గతంలోనూ తెలంగాణ ఎంసెట్‌ లో ఏపీ విద్యార్థులు రాసేవారు తక్కువగా ఉండేవారు. ఏపీలో మంచి కాలేజీలు లేకపోవడం, అక్కడ చదువుకునే పరిస్థితులు లేకపోవడంతో.. వీలైనంత మంది హైదరాబాద్‌ ఆ చుట్టుపక్కన ఉన్న ఇంజినీరింగ్‌ కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఐఐటీలో సీట్లు రాకపోతే.. హైదరాబాద్‌లోని ప్రముఖ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో చేరిపోవడానికి ఇలా రాస్తున్నారని చెబుతున్నారు.

ఏపీలో అధ్వానంగా కాలేజీలు..
ఏపీలో ఉన్న ఇంజినీరింగ్‌ కాలేజీల్లో కొన్ని మినహా మిగతావన్నీ ప్రభుత్వ విధానాల కారణంగా .. మెరుగైన వసతులు కల్పించలేక.. అరకొర ఫీజులు..అవి కూడా విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌ మెంట్‌ చేయడం ఆలస్యం కావడం తల్లుల ఖాతాల్లో వేస్తున్న నగదు కాలేజీల్లో జమ కాకపోవడం వంటి సమస్యలతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదే సమయంలో అక్కడి రాజకీయ పరిస్థితుల కారణం కాలేజీలు కూడా డిస్ట్రబ్‌ అవుతున్నాయి. ప్రతీ సభకు విద్యార్థుల్ని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి కారణాలతో ఉన్నత విద్య కోసం ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు యూనివర్సిటీల్లో చేరే వారిలో ఏపీ విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఆయా రాష్ట్రాలు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలు రాస్తూ సీట్లు సాధిస్తున్నారు.

ప్రత్యేక కోచింగ్‌..
తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటకలోని ప్రముఖ కళాశాలల్లో చేరడానికి ఏపీ విద్యార్థులు ప్రత్యేక కోచింగ్‌ కూడా తీసుకుంటున్నారు. ఇందుకోసం కూడా వారు హైదరాబాద్, బెంగళూరు, చెనై్నకి వెళ్తున్నారు. అక్కడి కోచింగ్‌ కూడా వారు ఆయా రాష్ట్రాల పోటీ పరీక్షల్లో సత్తా చాటడానికి దోహదపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper