Homeక్రీడలుT20 World Cup 2022 India vs England: ఫైనల్ లో ఓడటం కన్నా సెమీస్...

T20 World Cup 2022 India vs England: ఫైనల్ లో ఓడటం కన్నా సెమీస్ లో ఓడిందే మంచిదైంది..

T20 World Cup 2022 India vs England: టీమిండియా నిరుత్సాహ పరచింది. సెమీస్ లోనే ఇంటి దారి పట్టడం అభిమానులకు నిరాశే మిగిల్చింది. కప్ గెలుస్తుందనే ఆశలపై నీళ్లు చల్లింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో వెన్ను చూపి వెనుదిరిగింది. బాగా ఆడే వారిని పక్కన పెట్టి ఇతరులకు చాన్స్ ఇవ్వడంపై భారీ మూల్యమే చెల్లించుకుంది. ఇంకా నయం ఫైనల్ లో పాకిస్తాన్ పై ఓడి వచ్చే బదులు సెమీస్ లోనే ఇంటి దారి పట్టడం మంచిదైందని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. క్రీడాకారుల తీరుపై విమర్శలు చేస్తున్నారు. పేలవమైన ప్రదర్శనతో ఇంటికి రావడం నిజంగా దారుణమంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

T20 World Cup 2022 India vs England
T20 World Cup 2022 India vs England

సెమీస్ కు చేరినా ఇంగ్లండ్ చేతిలో పరాభవం ప్రతి ఒక్కరిని కలచి వేసింది. ఇంగ్లండ్ ను నిలువరించే క్రమంలో ఎలాంటి కట్టడి చేయలేదు. దీంతో ఇంగ్లండ్ వికెట్ కోల్పోకుండా లక్ష్యం చేధించడమే అందరిని ఆశ్చర్యపరచింది. కీలక ఆటగాళ్లను పక్కన పెట్టి ఏ మాత్రం ప్రభావం చూపని వారిని జట్టులోకి తీసుకోవడంతోనే విమర్శల పాలైంది. ఇప్పుడు ఇంటి దారి పట్టి అందరిలో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. గాయాల బారిన పడి కొందరు దూరమైనా ఫామ్ లో ఉన్న వారిని సైతం జట్టులోకి చేర్చుకోకపోవడమే వివాదాలకు కారణమవుతోంది.

టీ20 ప్రపంచ కప్ లో సత్తా చాటే వారు చాలా మంది ఉన్నా అలసిపోయారనే ఉద్దేశంతో ఎంపికలో పొరపాట్లు చేశారు. దీనికి భారీ మూల్యం చెల్లించుకున్నారు. పేలవ ప్రదర్శన చేసే వారికి అవకాశాలు కల్పించి కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం ఆందోళనలకు తావిస్తోంది. బుమ్రా, దీపక్ చాహర్, జడేజా ఫిట్ నెస్ సమస్యలతో బాధపడుతున్నందున వారిని ఎంపిక చేయలేదు. అర్షదీప్ ఒక్కడే జట్టులో స్థిరపడ్డాడు. దీపక్ హుడాను తీసుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

T20 World Cup 2022 India vs England
T20 World Cup 2022 India vs England

ప్రణాళిక లేకుండా ఇష్టారాజ్యంగా ఆటగాళ్ల ఎంపిక ఉండటంతోనే అపజయం కలిగింది. ప్రయోగాలు చేసి చివరకు కప్ తేకుండానే ఇంటికి తిరిగి రావడం అందరిలో కోపానికి కారణమవుతోంది. షమి, అశ్విన్ లను ప్రపంచ కప్ కు ఎంపిక చేయడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. జట్టుకు బాగా ఉపయోగపడే వారిని కాదని ఏ మాత్రం ప్రభావం చూపని వారిని ఎంపిక చేయడం విమర్శలకు దారి తీసింది. చాహల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ లాంటి మణికట్టు స్పిన్నర్లున్నా అశ్విన్, అక్షర పటేల్ లను తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper
Exit mobile version