Homeలైఫ్ స్టైల్China: తేయాకు బోధిసత్వుడి ప్రసాదమా.. చైనాలో బయటపడ్డ సంచలన నిజాలు!

China: తేయాకు బోధిసత్వుడి ప్రసాదమా.. చైనాలో బయటపడ్డ సంచలన నిజాలు!

China: తేనీరు.. చాలా మందికి.. ముఖ్యంగా నేటి తరానికి అర్థం కాని పదం.. చాయ్‌.. టీ.. ఈ పదాలు అయితే వాడుకలో ఉన్నవే. టీలో రకరకాల వెరైటీలు ఉన్నాయి. ఫ్లేవర్‌ను బట్టి ధరలు కూడా ఉన్నాయి. తేయాకు ధరలు, టీలో రకాలు ఉన్నట్లే.. తేయాకు పుట్టుక వెనుక కూడా టీ పరిమళమంత గొప్ప కథలు ఉన్నాయి. తాజాగా తేయాకుకు బోధిసత్వుడు బుద్ధుడికి ఉన్న సంబంధం ఒకటి వైరల్‌ అవుతోంది. బుద్ధుడికి తేయాకుకు సంబంధం ఏంటి అనే అనుమానం రావొచ్చు కానీ ఉందట. అదెలా అంటే.. బుద్ధుడి కనురెప్పల వెంట్రుకల నుంచి టీ మొక్క ఆవిర్భవించిందని కొందరి వాదన. దీనికి భిన్నంగా మరో కథ చైనా జానపదుల్లో వినిపిస్తుంది. ‘దయ’ దేవత కరుణతో తేయాకు మొక్కలు పుట్టాయని చైనీయులు బలంగా చెబుతారు. ఈ కథ చైనాలో బోధిసత్వుడి మూలాలను తెలియజేస్తుంది. ఈ గాథకు ఆయన్ను ప్రత్యక్షసాక్షిగా విశ్వసిస్తారు.

దైవ ప్రసాదంగా..
చైనీయులు తేయాకును దైవ ప్రసాదంగా భావిస్తారు. ఆ దేశంలోని ఒక ప్రాంతంలో బోధిసత్వుడి కంచు విగ్రహం ప్రతిష్టించి ఉంది. అది ఓ పురాతన ఆలయమట. ఓ నిరుపేద రైతు రోజూ వచ్చి ఆ గుడిని శుభ్రం చేస్తుండేవాడు. అయితే ఒకరోజు ఆకస్మికంగా బోధిసత్వుడి విగ్రహం కదిలిందట. దాన్ని చూడగానే రైతు మోకరిల్లి కళ్లు మూసుకున్నాడట. ఆ సమయంలో దయా దేవి లోగొంతుకతో ‘ఈ గుడి వెలుపల నీ భవిష్యత్తుకు తాళం చెవి ఉంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకో’ అని చెప్పిందట. ఆ మాటలు విన్న రైతు ఆశ్చర్యం చెందాడు. ఈ మాటలు నిజమా, కలా అర్థం కాలేదు. అయినా ఓసారి చూద్దామని గుడి బయటకు వెళ్లి వెతకడం ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఓ ఎండిపోయిన పొద కనిపించిందట. అదే తన భవిష్యత్‌కు తాళంచెవిగా భావించి దానిని తీసుకుని ఇంటికి వెళ్లాడు.

చిగురించి.. ఆదాయం పెంచి..
ఎండిపోయిన పొదరు ఆ రైతు ఇంటి ఆవరణలో పాదు తీసి నాటాడట. దానికి రోజూ నీళ్లు పోస్తూ జాగ్రత్తగా చూసుకోవడంతో ఆ ఎండిపోయిన పొద మళ్లీ చిగురు తొడిగిందట. కొన్నాళ్లకు పచ్చగా కళకళలాడింది. ఓ రోజు ఆ మొక్క ఆ ఆకులు సేకరించిన రైతు వాటిని నీళ్లలో వేసుకుని తాగాడట. దీంతో ఆయనకు ఎక్కడాలేని ఉత్సాహం వచ్చిందట. తర్వాత ఆ చెట్టు నుంచే చైనాలో తేయాకు మొక్కలు అంతటా విస్తరించాయని కొందరి నమ్మకం.

బోధిసత్వుడి ఆశీర్వాదంతో..
అలా బోధిసత్వుడి ఆలయ ఆవరణలో తేయాకు ఉనికిలోకి వచ్చిందనేది కథ. ఆ దయ గల దేవత సెలవిచ్చినట్టు కొన్ని పరిస్థితుల్లో ఏమీ పాలుపోకుండా బుర్ర బద్దలవుతున్న వేళ.. చిక్కటి టీ తాగితే చాలు.. మస్తిష్కాన్ని తట్టిలేపుతుంది. దీంతో చైనీయులు తేయాకును బోధిసత్వుడి ఆశీర్వాదంగా, ప్రసాదంగా భావిస్తున్నారు. అలా తేయాకుకు, బోధిసత్వుడికి సంబంధం ఉందన్న కథ ప్రచారంలో ఉంది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version