Homeబిజినెస్Pension Scheme: నెలకు రూ.55 డిపాజిట్‌ చేస్తే ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్.. ఎలా...

Pension Scheme: నెలకు రూ.55 డిపాజిట్‌ చేస్తే ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్.. ఎలా పొందాలంటే?

Pension Scheme: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన పథకం కూడా ఒకటనే సంగతి తెలిసిందే. అసంఘటిత రంగంలోని కార్మికులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ప్రతి నెలా ఈ స్కీమ్ లో 55 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే నెలకు 3,000 రూపాయల వరకు పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. దేశంలో 46 లక్షల కంటే ఎక్కువమంది ఈ స్కీమ్ లో చేరారు.

55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు డిపాజిట్ చేయడం ద్వారా ఈ స్కీమ్ కు అర్హత పొందే అవకాశం ఉంటుంది. చిన్నచిన్న పనులు చేస్తూ జీవనం సాగించే వాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు అని చెప్పవచ్చు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, నేషనల్ పెన్షన్ సిస్టమ్, ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హత పొందడం సాధ్యం కాదని చెప్పవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఈ స్కీమ్ లో చేరే ఛాన్స్ ఉంటుంది.

బ్యాంక్ ఖాతా, జన్ ధన్ ఖాతా సహాయంతో ఈ స్కీమ్ లో చేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 60 సంవత్సరాల వరకు ఈ స్కీమ్ లో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తే 60 సంవత్సరాల తర్వాత ఈ స్కీమ్ నుంచి బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ అందజేయడం ద్వారా సులభంగా ఈ స్కీమ్ లో చేరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

నెలకు 15,000 రూపాయల కంటే తక్కువ వేతనం పొందుతున్న వాళ్లు ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలను పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version