Homeఆంధ్రప్రదేశ్‌Jagan photo remarks : జగన్ మరో క్రింజ్ ఎలివేషన్; చనిపోయిన తర్వాత నా ఫోటో...

Jagan photo remarks : జగన్ మరో క్రింజ్ ఎలివేషన్; చనిపోయిన తర్వాత నా ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలి..

Jagan photo remarks : ఉత్తరకొరియాలో నియంత కిమ్ ఆదేశాలు మాత్రమే నడుస్తూ ఉంటాయి. ఆయన చేసుకున్నట్టుగానే అక్కడి ప్రజలు హెయిర్ కట్ చేసుకోవాలి. ఆయన ఫోటోలు మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి. ఆయన చెప్పినట్టుగానే నడుచుకోవాలి. చివరికి ఆయన తిన్న తిండే అక్కడి ప్రజలు తినాలి. ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన ఏం చెప్తే అక్కడ ప్రజలు అదేం చేయాలి. కాదు కూడదు అంటే మాత్రం వచ్చే బర్త్ డే ఉండదు.

కిమ్ వ్యవహార శైలి పట్ల ప్రపంచ దేశాల నేతలు ఇప్పటికి ఆశ్చర్యపోతుంటారు. ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. సరే అదంటే కమ్యూనిస్టు దేశం కాబట్టి సరిపోయింది. ప్రజాస్వామ్యంలో అది సాధ్యమవుతుందా.. ఒక నాయకుడి ఫోటోలను ప్రజలు మొత్తం తమ ఇంట్లో పెట్టుకోవడం వీలవుతుందా.. ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది. తమకు నచ్చినట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇష్టానుసారంగా వ్యవహరించడానికి అవకాశం ఉండదు..

ఈ విషయాన్ని మర్చిపోయారో.. తాను ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో కాదనుకున్నారో తెలియదు గాని.. జగన్ మరోసారి క్రింజ్ కామెడీ చేశారు. ఏకంగా అందరూ నవ్వుకునే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఆయన ఫోటో ప్రజలు పెట్టుకోవాలట. అదే ఆయన తపన.. తాపత్రయమట. ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన సాగిస్తే ఫోటోలు పెట్టుకోవాలని అడుక్కోవలసిన అవసరం ఉండదు. ఆటోమెటిగ్గా వాళ్ళే పెట్టుకుంటారు. సీనియర్ ఎన్టీఆర్ ఫోటోలు నేటికీ ప్రతి ఇంట్లో కనిపిస్తూనే ఉంటాయి. రూపాయికి కిలో బియ్యం అనే పథకం పేరు చెప్తే చాలు ఆయన గుర్తుకొస్తారు. ఆరోగ్య శ్రీ పథకం.. పేరు చెప్తే వైయస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకొస్తారు. చివరికి సైబరాబాద్ పేరు ప్రస్తావనకు వస్తే చంద్రబాబు యాదికి ఉంటారు. ఇదంతా వారు బలవంతంగా చేయలేదు. వారు ప్రజల్లో ప్రేమను పొందారు కాబట్టి.. ఈ స్థాయిలో గౌరవాన్ని పొందారు.

ఇటీవల కాలంలో జగన్ తరచూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. ఏదో ఒక అంశం మీద తెరపైకి వస్తున్నారు. పూర్తిస్థాయి సమాచారం లేక తనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల ముందు చులకన అవుతున్నారు. డీఎస్సీ విషయంలో అలానే చేశారు. ఇప్పుడు ఏదో మీటింగ్ పేరుతో కార్యకర్తలను కలిసి మాట్లాడారు. అందులో తన ఫోటో గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. చివరికి మీమర్లకు.. చేతినిండా పని కల్పించి వెళ్లిపోయారు. అయినా జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి స్క్రిప్ట్ రాసిస్తున్న వారికి ఓ దండం పెట్టాలి. ఈ స్థాయిలో క్రింజ్ కామెడీ తోపు డైరెక్టర్ల వల్ల కూడా కాదు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular