
ఏపీలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో అడ్డా వద్దా కార్మికుల సమస్యలపై ఆయన ఆరా తీశారు. రోజు 400 మంది పనుల కోసం అడ్డా దగ్గరికి వస్తుంటే 40 మందికి మించి కూలి దొరకడం లేదని కార్మికులు ఆయన దగ్గర వాపోయారు. పనుల కోసం ఎదురు చూసి చివరకు ఇంటికి పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అందుబాటులో లేకే భవన నిర్మాణ కూలీలు రోడ్డున పడ్డారని నాదెండ్ల మండిపడ్డారు.