Homeవార్త విశ్లేషణViral Video : ఏంటి గురూ.. ప్రియురాలితో డీఈవో రాసలీలలు.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.....

Viral Video : ఏంటి గురూ.. ప్రియురాలితో డీఈవో రాసలీలలు.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. వీడియో వైరల్‌..!

Viral Video :  అతను పాఠశాలలు, విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అధికారి. తప్పుడు మార్గంలో నడిచే ఉపాధ్యాయులకు సరైన మార్గ నిర్దేశం చేయాల్సిన గురువు. విద్యార్థుల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించాల్సిన జిల్లా విద్యాశాఖ బాస్‌. కానీ, ఆ బాసే.. గాడి తప్పాడు. తనకు భార్య ఉండగానే ఆమెను వదిలేసి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య ప్రియురాలిలో కులుకుతున్న తన భర్తను రెండ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. నల్గొండ జిల్లా విద్యాధికారి కొన్ని రోజులుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య భర్తపై నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే గురువారం(నవంబర్‌ 21న) తన భర్త ఉంటున్న ఇంటికి వెళ్లింది. ఇద్దరు ఒకే ఇంట్లో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో గుట్టుగా నడుస్తున్న ఈ వ్యవహారం రట్టయింది. డీఈవోతో ఉంటున్న మహిళను ఎవరని నిలదీయగా సదరు డీఈవోగారు.. తన భార్యనే బయటకు వెళ్లిపో అని దబాయించాడు. ఇంట్లోకి వెళ్లడానికి కూడా అనుమతించలేదు. ఈ వ్యవహారం మొత్తాన్ని ఆమెతో వచ్చిన కుటుంబ సభ్యులు వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

14 ఏళ్ల క్రితం వివాహం..
ఈ వీడియోలో.. డీఈవో భార్య మాట్లాడుతూ తనను డీఈవో 14 ఏళ్ల క్రితం వివాహం చేసుకుని వదిలేశాడని తెలిపింది. తర్వాత కోర్టులో విడాకుల కేసు వేసి నడిపిస్తున్నాడని ఆరోపించింది. లాయర్లను మెయింటేన్‌ చేస్తూ కేసు తేల్చడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కేసు కోర్టులో ఉండగానే మరో మహిళతో సంసారం చేస్తున్నాడని పేర్కొంది. గతంలో మహబూబ్‌నగర్‌లో కూడా మరో మహిళతో ఇలాగే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. ఇప్పుడు ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నాడని తెలిపింది. తనకు తెలియకుండా మరో మహిళతో ముగ్గురు పిల్లలను కూడా కన్నాడని ఆరోపించింది. పోలీసులు, ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

రంగంలోకి పోలీసలు..
ఇక ఈ గొడవ జరుగుతున్నంత సేపు డీఈవోగారు.. ఎవరికో ఫోన్‌ చేస్తున్నట్లు కనిపించారు. చివరకు సమాచారం అందుకున్న నల్గొండ టూటౌన్‌ పోలీసులు డీఈవో భార్య, ఆమెతో వచ్చినవారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్య తీసుకుంటామని వెల్లడించారు. దీంతో డీఈవో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక డీఈవో వ్యవహారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో డీఈవో మహిళా ఉపాధ్యాయులను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు ఉన్నాయి. తనకు లొంగనివారిని సస్పెండ్‌ చేశారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. రాజకీయ పలుకుబడితో నల్గొండ జిల్లాలోనే ఏళ్లుగా తిష్టవేశారనే ఆరోపణలు ఉన్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular