
కరోనా కష్ట కాలంలో ఆస్తి పన్ను పెంచడం, చెత్త పన్ను విధించడం దారుణమని బీజేపీ నేతలు మండిపడ్డారు. బుధవారం ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పన్నులు పెంచుతుంటే ప్రజలు ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పన్నుల పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.