Homeజాతీయం - అంతర్జాతీయంప్రజారక్షణలో ఏ ప్రభుత్వం విఫలమైనా ఖండిస్తాం.. అసదుద్దీన్ ఓవైసీ

ప్రజారక్షణలో ఏ ప్రభుత్వం విఫలమైనా ఖండిస్తాం.. అసదుద్దీన్ ఓవైసీ

పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగుతున్న హింసాత్మక ఘటనలపై ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికి జీవించే హక్కు అనేది ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వానికైనా ప్రజల జీవించే హక్కును కాపాడటమే ప్రధాని విధి అయి ఉండాలని అసద్ సూచించారు. ఏ ప్రభుత్వమైతే ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోతదో ఆ ప్రభుత్వం విధి నిర్వహణలో పూర్తిగా విఫలమైనట్టేనని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు.  దేశంలో ఏ ప్రాంతంలో ఏ ప్రభుత్వం ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైనా ఆ ప్రభుత్వ వైఫలాన్ని తాము ఖండించి తీరుతామని ఆయన తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version