
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ యువ హీరో సాయిధరమ్ తేజ్ హైదరబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై పలువురు రాజకీయ నేతలు, టావీవుడ్ పెద్దలు, సీనియర్, జూనియర్ హీరోలు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటి, బీజేపీ నేత విజయశాంతి కూడా స్పందించారు. సాయిధరమ్ తేజ్ తో తనకున్న అనుబంధాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆయన ప్రవర్తనపై ప్రసంశలు కురిపించారు. సాయి త్వరగా కోలుకోవాలని విజయశాంతి ఆకాంక్షించారు.