Homeఎంటర్టైన్మెంట్Panja Vaisshnav Tej : ఏకంగా 100 కథలను రిజెక్ట్ చేసిన మెగా హీరో వైష్ణవ్...

Panja Vaisshnav Tej : ఏకంగా 100 కథలను రిజెక్ట్ చేసిన మెగా హీరో వైష్ణవ్ తేజ్.. చివరికి ఆ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్..

Panja Vaisshnav Tej : మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రతీ హీరో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను అందుకొని , ఇండస్ట్రీ లో మంచి స్థానం లో కొనసాగుతున్నారు. ఒక్క అల్లు శిరీష్ మాత్రమే ఇండస్ట్రీ లో సక్సెస్ సాధించలేకపోయారు. చివరికి ‘ఉప్పెన’ తో ఇండస్ట్రీ లోకి గ్రాండ్ గా సాయి ధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ కూడా బంపర్ హిట్ కొట్టాడు. ఆయన మొదటి చిత్రం ‘ఉప్పెన’ ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపుగా 120 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాంటి సెన్సేషనల్ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ కెరీర్ రాబోయే రోజుల్లో పీక్ రేంజ్ కి వెళ్ళిపోతుందని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకొని , దిక్కులేని స్థితికి వెళ్ళిపోయాడు.

ఈయనతో పాటు ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరోలు , ఈయన తర్వాత ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరోలు కూడా వరుస విజయాలను అందుకుంటూ మార్కెట్ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ వైష్ణవ్ తేజ్ కి అలాంటి పరిస్థితి లేదు. ‘ఉప్పెన’ తర్వాత ఆయన హీరో గా నటించిన ‘రంగ రంగ వైభవంగా’, ‘కొండపోలం’, ‘ఆదికేశవ’ వంటి సినిమాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఈ సినిమాలు ఎప్పుడు విడుదలైందో , ఎప్పుడు థియేటర్స్ నుండి వెళ్లిపోయిందో కూడా ఆడియన్స్ కి తెలీదు , కనీసం మెగా హీరోలు కూడా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడలేదు. అలాంటి సినిమాలు చేశాడు. ఆయన చివరి చిత్రం ‘ఆదికేశవ’ 2023 వ సంవత్సరం లో విడుదలైంది. అంటే దాదాపుగా మూడేళ్లు కావొస్తుంది. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా విడుదల చేయకపోవడం తో వైష్ణవ్ తేజ్ సినిమాలను ఆపేశాడా అనే అనుమానం అందరిలో కలిగింది.

కానీ ఆయన ఈ మోడీల్లాలో సరైన కథ కోసం ఎదురు చూస్తున్నాడట. దాదాపుగా ఆయన 100 కథలను ఈ మూడేళ్ళలో రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈసారి కొడితే ‘ఉప్పెన’ ని మించిన హిట్ కొట్టాలని పంజా వైష్ణవ్ తేజ్ ఫిక్స్ అయ్యాడు. అందుకే కథ ఎంపిక విషయం లో ఇంతటి జాప్యం జరిగింది. ఎట్టకేలకు రీసెంట్ గానే ఆయన ఒక కథ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ మహేష్ రీసెంట్ గానే వైష్ణవ్ తేజ్ ని కలిసి ఒక కథ వినిపించాడట. ఈ కథ వైష్ణవ్ తేజ్ కి పిచ్చి పిచ్చిగా నచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ గా భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఈ ఏడాది లోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular