మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..

జమ్ముకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో శనివారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, మరో ఇద్దరు పౌరులు మరణించారు. మరో ఇద్దరు పోలీసులు, ఓ పౌరుడికి గాయాలైనట్లు సమాచారం. ఉత్తర కాశ్మీర్ లోని సోపూర్ లోని అరంపోరా ప్రాంతంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Written By: Velishala Suresh, Updated On : June 12, 2021 1:58 pm
Follow us on

జమ్ముకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో శనివారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, మరో ఇద్దరు పౌరులు మరణించారు. మరో ఇద్దరు పోలీసులు, ఓ పౌరుడికి గాయాలైనట్లు సమాచారం. ఉత్తర కాశ్మీర్ లోని సోపూర్ లోని అరంపోరా ప్రాంతంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.