
కరోనా సంక్షోభంతో సతమతమవుతోన్న భారత్ కు పలు దేశాలు, సంస్థలు సాయాన్ని ప్రకటిస్తున్నాయి. తాజాగా మైక్రోబ్లారింగ్ దిగ్గజం ట్విట్టర్ 15 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్ ఏ అనే మూడు ప్రభుత్వేతర సంస్థలకు విరాళంగా ఇచ్చినట్లు ట్విట్టర్ సీఈఓ జాక్ ప్రాట్రిక్ డోర్సే ట్వీట్ చేశారు. కేర్ సంస్థకు పది మిలియన్ డాలర్లు ఇవ్వగా ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషన్ యూఎస్ ఏలకు 2.5 మిలియన్ డాల్లు చొప్పున ఇచ్చినట్లు పేర్కొన్నారు.